ఏపీలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సిపి స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైలులో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టయి నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి వ్యవహరిస్తున్నట్లుగా తాము వ్యవహరించి ఉంటే ఈ కేసులో అప్పుడే తీసేసుకునే వాళ్ళమన్నారు.
పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సజ్జల
ఏపీలో వైసిపి కార్యకర్తలు, నాయకులు అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయని వైఎస్ఆర్సిపి స్టేట్ కోఆర్డినేటర్ సభ్యుల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను జైలులో పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ఎంపీ సురేష్ అక్రమ కేసుల్లో అరెస్టయి నాలుగు నెలలు అవుతోందని, ఆధారాలు లేకుండా సురేష్ పై కేసులు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి వ్యవహరిస్తున్నట్లుగా తాము వ్యవహరించి ఉంటే ఈ కేసులో అప్పుడే తీసేసుకునే వాళ్ళమన్నారు. తమ పాలనలో చట్టం తన పని తాను చేసుకుపోయిందన్నారు. కోర్టులో ఉన్న లొసుగులను ఉపయోగించి జైలులో ఉంచుతున్నారని విమర్శించారు. సురేష్ కు వాటర్ బాటిల్ కూడా అనుమతించడం లేదని, సీఎం కొడుకే ఫోన్ చేసి సురేష్ ను ఎలా ఉంచాలనేది చెబుతున్నారని ఆరోపించారు. ఇవన్నీ తాము మౌనంగానే భరిస్తున్నామని, వైసీపీని లేకుండా చేయాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన మహిళలను అరెస్టు చేస్తున్నారని, గతంలో 30 ఏళ్ల క్రితం నక్సలైట్లను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేస్తున్నారని విమర్శించారు. వేధించడం అంటే ఎలా ఉండాలో తమకు నేర్పుతున్నారని పేర్కొన్నారు. ప్రజలు ఇచ్చిన అధికారం ప్రజల కోసమే ఉపయోగించాలని, కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు వినియోగించుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవడంలో కొత్త కొత్త పద్ధతులు ఉపయోగిస్తుందని, గుంటనక్కల్ల వ్యవహరించడం వైసిపికి తెలియదని స్పష్టం చేశారు. కోటమి నాయకుల కంటే బలంగా కొట్టగలిగే శక్తి వైసిపికి ఉందని, నాలుగేళ్లలో తాము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చెప్పు నా కూడా వినే పరిస్థితి ఉండదని సజ్జల హెచ్చరించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల పైన దృష్టి సారించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, సరైన సమయంలో బుద్ధి చెబుతారని స్పష్టం చేశారు. ఎప్పటికైనా కూటమి నాయకుల ఆలోచన విధానంలో మార్పులు రావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ నందిగామ సురేష్ ను పరామర్శించిన వారిలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు ఇతర నాయకులు ఉన్నారు.