ఇంటి వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు.. సిఎస్ నీరబ్ కుమార్ వెల్లడి

సామాజిక భద్రత పింఛన్లను జూలై ఒకటో తేదీన ఫించన్ దారుల ఇంటి వద్ద పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు.

Cs Nirab Kumar Prasad

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్


సామాజిక భద్రత పింఛన్లను జూలై ఒకటో తేదీన ఫించన్ దారుల ఇంటి వద్ద పంపిణీ చేయడానికి పటిష్టమైన ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే అందుకు అనుగుణంగా ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పింఛన్ల పంపిణీ విషయంలో అనుసరించాల్సిన విధివిధానాలను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 65,18,496 మంది పెన్షన్ దారులకు రూ.4399.89 కోట్లను గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్లు ఒక్క రోజులోనే పంపిణీ చేయించాలని సూచించారు. అనివార్య కారణాల వల్ల ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉంటే రెండో రోజు కూడా పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలన్నారు. వృద్ధులు, వితంతువులు తదితర 11 ఉప విభాగాలకు చెందిన వారి పెన్షన్ రూ.3000 నుంచి రూ.4000 పెంచిన నేపథ్యంలో ఒకటో తేదీ రూ.4 వేలతోపాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఎరియర్స్ కలుపుకొని మొత్తం రూ.7000 పంపిణీ చేయాలని ఆదేశించారు. రెండో కేటగిరీలో పాక్షిక దివ్యాంగులకు రూ.3000 నుంచి రూ.6,000కు, మూడో కేటగిరీలో పూర్తిస్థాయి దివ్యాంగులకు రూ.5000 నుంచి రూ.15 వేలకు, నాలుగో కేటగిరిలో కిడ్నీ, తలసీమియా, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి రూ.5000 నుంచి పది వేలకు పింఛన్ల సొమ్ము పెంచిన విధంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. ఐదో కేటగిరిలోని వారికి ఏ మార్పు లేకుండా యధావిధిగా పెన్షన్ల సొమ్మును పంపిణీ చేయాల్సి ఉందని తెలిపారు. 64.75 లక్షల మంది పింఛన్ దారుల ఇళ్ల వద్ద రూ.4,369.82 కోట్లు, మిగిలిన మొత్తాన్ని రాష్ట్రం బయట ఉండే 43 వేల మంది పెన్షన్ దారులు, బయట చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు డిబీటి పద్ధతిలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఇళ్ల వద్ద నగదు రూపేనా పంపిణీ చేయాల్సిన పింఛన్ సొమ్మును 29వ తేదీ శనివారం సంబంధిత బ్యాంకు బ్రాంచ్ ల నుంచి డ్రా చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు. జూలై ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుంచి పింఛన్ దారులు ఇంటివద్ద సొమ్మును పంపిణీ చేసేందుకు గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులతోపాటు అవసరం మేరకు ఇతర శాఖల ఉద్యోగుల సేవలు కూడా వినియోగించుకోవాలని సూచించారు. ఒక్కో ఉద్యోగి 50 ఇళ్లకు చొప్పున పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని అప్పగించేలా క్రస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం నాటికి పూర్తి చేయాలని సిఎస్ అధికారులను ఆదేశించారు. 

సిఎస్ నేరబ్ సర్వీస్ పొడిగింపు 

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేరపు కుమార్ ప్రసాద్ పదవి కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది ఈమెరకు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సురేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు ఈ నెలాఖరుణ నెల చేయాల్సి ఉంది కానీ మరో ఆరు నెలల పాటు ఆయన సేవలో తమ రాష్ట్రానికి కావాలని కేంద్రానికి కోటమి ప్రభుత్వం లేఖ రాసింది కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ ఏడాది డిసెంబర్ వరకు ఆయన సీరియస్ గా కొనసాగుతారు కాగా సీనియార్టీలో లేకపోయినా గత ప్రభుత్వం జార్ రెడ్డిని సిఎస్కే నియమించింది ఎన్నికల సమయంలో వైసీపీకి కొమ్ముకాస్తూ ఆయన అడ్డుగోల నిర్ణయాలు తీసుకున్నారు కోటమ్మ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయన సెలవు పై వెళ్ళిపోయారు వాస్తవానికి సీనియారిటీలో నేరపు కుమార్ ప్రసాద్ మొదటి స్థానంలో ఉన్నారు కానీ గత ప్రభుత్వం ఆయన కాదని సీనియార్టీలో ఐదవ స్థానంలో ఉన్న జవహర్ రెడ్డిని సిఎస్ గారి నియమించింది దేనితో అప్పట్లో ఐఏఎస్ అంతా అభ్యంతరం వ్యక్తం చేసిన వారుగోడు ఎవరు వినిపించుకోలేదు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్