భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకుపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ఈ కోవలో దిగ్గజ సంస్థలు సాంసంగ్, రియల్ మీ, షామీ, వివో, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లోలోని సిస్టం ప్రేమ్ వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కర్నల్, ఏఆర్ఎం కాంపోనెంట్లు, మీడియా టెక్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ కాంపోనెంట్లు, స్కాల్కమ్ క్లోజ్ సోర్స్ కాంపోనెంట్లలో లొసుగులను గుర్తించినట్లు సెర్ట్ వివరించంది.
ఫోన్
భారత సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇండియా) దేశంలోని ఆండ్రాయిడ్ యూజర్లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. 10 కోట్లకుపైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రమాదంలో ఉన్నట్లు అప్రమత్తం చేసింది. ఈ కోవలో దిగ్గజ సంస్థలు సాంసంగ్, రియల్ మీ, షామీ, వివో, వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్లోలోని సిస్టం ప్రేమ్ వర్క్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్లు, కర్నల్, ఏఆర్ఎం కాంపోనెంట్లు, మీడియా టెక్ కాంపోనెంట్లు, క్వాల్కమ్ కాంపోనెంట్లు, స్కాల్కమ్ క్లోజ్ సోర్స్ కాంపోనెంట్లలో లొసుగులను గుర్తించినట్లు సెర్ట్ వివరించంది. ఆండ్రాయిడ్ వెర్షన్లు 12, 12 ఎల్, 13, 14 లో గుర్తించిన ఈ లొసుగులను ఆసరాగా చేసుకొని, హ్యాకర్లు పంజా విప్పే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు అప్రమత్తమవ్వకుంటే వారి సున్నితమైన డేటాను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది. పైన పేర్కొన్న వెర్షన్ల ఆండ్రాయిడ్, ఆపరేటింగ్ సిస్టం వినియోగించే స్మార్ట్ఫోన్ యూజర్లు వెంటనే సెక్యూరిటీ ప్యాచ్ లను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. నైజీరియాలో ఈ నెల 10న ఆండ్రాయిడ్ లోని లొసుగులతో హ్యాకర్లు 70 వేల స్మార్ట్ ఫోన్లపై పంజా విసిరినట్లు ఆ దేశ ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం గుర్తించిన ఆండ్రాయిడ్లు లొసుగుల తీవ్రతను అత్యధికంగా పేర్కొంది. హ్యాకర్లు అనస్ట బ్యాంకింగ్ పేరుతో ఈ 70 వేల ఫోన్లలో ట్రోజన్లను చొప్పించారని వివరించింది. ఈ ట్రోజన్ల ద్వారా యూజర్ల బ్యాంకింగ్ వివరాలను కొల్లగొట్టినట్లు గుర్తించినట్లు తెలిసింది.
ఈ సమస్యకు అదొక్కటే పరిష్కార మార్గం..
ప్రస్తుతం ఏర్పడిన ఈ సమస్యకు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెక్యూరిటీ ఫీచర్లను అప్డేట్ చేసుకోవడం ఒక్కటే పరిష్కారంగా సెర్ట్ ఇండియా, సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. యూజర్లు తమ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సిస్టమ్ అప్డేట్ ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా సాఫ్ట్వేర్ ను, సెక్యూరిటీ ప్యాచ్ లను అప్డేట్ చేసుకోవచ్చు. పలు స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఇప్పటికే సెక్యూరిటీ ప్యాచ్ లను విడుదల చేశాయి. మిగతావి కూడా ఈ వారంలో వాటిని అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రోజన్ దాడులను అడ్డుకోవడానికి స్మార్ట్ ఫోన్లో ఏవైనా కొత్త యాప్ లు ఇన్స్టాల్ అయ్యాయా అనే విషయాన్ని గుర్తించి వాటిని అన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వాట్సాప్, సోషల్ మీడియా, ఈమెయిల్ ద్వారా వచ్చే అపరిచిత అనుమానాస్పద లింకులను క్లిక్ చేయకుండా ఉండడం ద్వారా ఈ తరహా ఇబ్బందుల నుంచి ప్రొటెక్షన్ పొందవచ్చు.