ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
సరస్వతి పవర్ ప్లాంట్ భూములు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సరస్వతి పవర్ ప్లాంట్ కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లను ఏపీ ప్రభుత్వం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో ఈ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసేంట్ భూమి రిజిస్ట్రేషన్ కలెక్టర్ అరుణ్ బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్టర్ సురేష్ ఒక ప్రకటనను విడుదల చేశారు. ఆ భూములను వెనక్కి తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ విషయానికి వస్తే పల్నాడు జిల్లాలో జగన్ కుటుంబానికి సరస్వతి పవర్ ఇండస్ట్రీస్ ఏర్పాటు కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1516 ఎకరాల భూములను కేటాయించారు. ఇందులో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ భూముల రి సర్వే ప్రక్రియను చేపట్టారు. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1250 ఎకరాల భూమిని రైతుల నుంచి సరస్వతి పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అప్పటినుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదు.
ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా అన్న వివాదాలతో గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ పర్యటించారు. ఆయన ఆదేశాలతో ఈ వ్యవహారంపై లోతుగా విచారణ చేయాలని ప్రభుత్వం భావించింది. అందుకు అనుగుణంగానే విచారణను అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం అధికారులు కొన్ని విషయాలను గుర్తించారు. అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించిన అధికారుల ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక సమర్పించారు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ ను రద్దు చేయాలని ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. ఇందులో భాగంగానే వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు గుర్తించారు. ఆ భూముల రిజిస్ట్రేషన్ రద్దు కోరుతూ నివేదిక ఇవ్వడంతో సరస్వతి పవర్ ప్లాంట్స్ భూములోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దుకు ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. గతంలో సరస్వతి పవర్ భూములకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఖండించారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.