టిడ్కో ఇళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. జూన్ నాటికి లబ్ధిదారులకు అందజేత.!

ఏపీలో కూటమి ప్రభుత్వం టిడ్కో ఏళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను పంపిణీ చేయలేదు. గడిచిన ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కూటమి.. ఈ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే టీడ్కో ఇల్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందుకు అనుగుణంగానే శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు.

Tidco Houses

టిడ్కో ఇళ్ల

ఏపీలో కూటమి ప్రభుత్వం టిడ్కో ఇళ్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. గడిచిన కొన్నాళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి చేసిన ఇళ్లను పంపిణీ చేయలేదు. గడిచిన ఏడాది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన కూటమి.. ఈ ఇళ్లను లబ్ధిదారులకు వెంటనే అందజేస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఆ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించలేదు. ఈ నేపథ్యంలోనే టీడ్కో ఇల్లను లబ్ధిదారులకు అందజేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. అందుకు అనుగుణంగానే శుక్రవారం  రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. పాలకొల్లు లోని ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. వచ్చే జూన్ నాటికి మిగిలిన టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులు అందరికీ అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గత టిడిపి ప్రభుత్వంలో 90 శాతం పూర్తిచేసిన ఇళ్లను వైయస్ జగన్ ప్రభుత్వంలో ధ్వంసం అయ్యాయని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. టిడిపి ప్రభుత్వంలో పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వం బ్యాంకులో తాకట్టుపెట్టి ఐదువేల కోట్లను దారి మళ్లించి లబ్ధిదారుల నెత్తిన అప్పుల భారం మోపిందని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో గృహాలను ఉచితంగా ఇస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులను దగా చేశాడన్నారు.

గత వైసిపి ఐదేళ్ల పాలనలో అర్ధ రూపాయి పని అరబస్త సిమెంట్ పనికి నోచుకోక టిడ్కో ఇల్లు ధ్వంసం అయ్యాయి అన్నారు. చంద్రబాబు లబ్ధిదారులను ఆదుకోవాలని ఉద్దేశంతో లబ్ధిదారుల బ్యాంకు రుణాలకు సంబంధించి రూ. 140 కోట్లు మంజూరు చేశారని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పూర్తయిన ఇళ్లను కొద్ది రోజుల్లోనే లబ్ధిదారులకు అందజేస్తామని వెల్లడించారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నట్లు వివరించారు. మంత్రి ప్రకటనతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ప్రభుత్వం ఇళ్లను అందజేసే చర్యలు చేపడుతుండడంతో వారంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వేలాదిమంది లబ్ధిదారులు ఇల్లు కేటాయింపుల కోసం ఎదురుచూస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా గృహ నిర్మాణ శాఖ అధికారులకు కీలక ఆదేశాలను జారీచేసింది. మధ్యలో ఉండిపోయిన ఇళ్లకు సంబంధించి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కొద్దిరోజుల కిందట భారీగా నిధులను కూడా ప్రభుత్వ మంజూరు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఇల్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు చేపట్టడం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్