రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కళా రత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన ఈ పురస్కారాల ప్రకటనను తిరిగి ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించి విజేతల జాబితాను విడుదల చేసింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో ప్రముఖులను అవార్డులను ఎంపిక చేశారు. కళా రత్న ఉగాది పురస్కారాలతో కలుపుకొని మొత్తం 202 మందిని ఎంపిక చేశారు. ఇందులో 86 మందికి కళా రత్న, 116 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటించారు.
ప్రతీకాత్మక చిత్రం
రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కళా రత్న (హంస), ఉగాది పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు ఆరేళ్లుగా ఆగిపోయిన ఈ పురస్కారాల ప్రకటనను తిరిగి ఏపీ ప్రభుత్వం పునరుద్ధరించి విజేతల జాబితాను విడుదల చేసింది. సాహిత్యం, కళలు, జర్నలిజం, హాస్యావధానం, బాల సాహిత్యం, పద్యం, సాంస్కృతిక సేవలు, మిమిక్రీ, బుర్రకథ, హరికథ, నాటకం, సామాజిక సేవ, సినిమా ఇలా అనేక రంగాల్లో ప్రముఖులను అవార్డులను ఎంపిక చేశారు. కళా రత్న ఉగాది పురస్కారాలతో కలుపుకొని మొత్తం 202 మందిని ఎంపిక చేశారు. ఇందులో 86 మందికి కళా రత్న, 116 మందికి ఉగాది పురస్కారాలను ప్రకటించారు. శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆదివారం ఉదయం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా విజయతలకు అవార్డులను ప్రధానం చేయనున్నారు. చివరిసారిగా 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఉగాది అవార్డులను అందించింది. వైసీపీ ప్రభుత్వం ఈ పురస్కారాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా మళ్లీ కూటమి ప్రభుత్వం ఈ పురస్కారాలను అందించే విధంగా ప్రకటన చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. సాహిత్య విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృతి వంటి శ్రీనివాసరావుకు కళా రత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది.
ఆచార్య ఎస్ రఘునాథ శర్మకు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, సయ్యద్ నజీర్ అహ్మద్, దాట్ల దేవనం రాజు, ఓలేటి పార్వతీశం, బొర్రా గోవర్ధన్, మన్నే శ్రీనివాసరావు తదితరులకు కూడా ఈ విభాగంలో అవార్డులు దక్కాయి. సంగీతంలో మల్లాది సోదరులు, నృత్యంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సాయి సౌజన్యకు పురస్కారం లభించింది. సినిమా విభాగంలో నటుడు పృథ్వీరాజ్, నాటక రంగంలో దోర్నాల హరిబాబు, కావూరు సత్యనారాయణ, హరికథా విభాగంలో సభ భారతీయులకు కళారత్న అవార్డును ప్రభుత్వం ప్రకటించింది. జర్నలిజంలో 9 మంది కళా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో ఆంధ్రజ్యోతి న్యూస్ ఎడిటర్ పీకే నాగ సుధాకర్, ఈనాడు ఎడిటర్ ఎం నాగేశ్వరరావు, స్వాతి ఎడిటర్ వేమూరి బలరాం, కొల్లు అంకబాబు, భోగాది వెంకటరాయుడు, మల్లీస్వర్లను ఎంపిక చేశారు. సేవారంగంలో తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, సిహెచ్ మస్తానయ్య, ఇతరుల విభాగంలో విశ్రాంత ఐపీఎస్ అధికారి కొండా నరసింహారావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వరరావు, ఐఆర్ఎస్ అధికారి ఎం ప్రసాద్ ఎంపికయ్యారు. ఒక 116 మందికి ఉగాది పురస్కారాలు లభించాయి. సాహిత్య విభాగంలో ఈతకోట సుబ్బారావు, చలపాక ప్రకాష్, బండ్ల మాధవరావు, కే వరలక్ష్మి, ఎస్ అబ్దుల్ అజీజ్, కుప్పిలి పద్మా తదితరులకు నాటక రంగంలో చేగుండి వీర వెంకట సత్యనారాయణ లకు అవార్డులు ప్రకటించారు. కళా రత్న అవార్డు గ్రహీతలకు 50 వేల నగదు పురస్కారం, హంస ప్రతిమతో పాటు సత్కరించనున్నారు. ఉగాది పురస్కారాల విజేతలకు పది వేల నగదు పురస్కారం, మెమొంటో అందించనున్నారు.