వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం.. ఆదేశాలు జారీ

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న హెచ్ఎంపివీ వైరస్ కేసులు భారత్ లోనూ నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు వీధి శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మైక్రోబయాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని ఆదేశించారు.

Iconic image

ప్రతికాత్మక చిత్రం

ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న హెచ్ఎంపివీ వైరస్ కేసులు భారత్ లోనూ నమోదవుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి వరకు వీధి శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులు నమోదైన విషయాన్ని ప్రస్తావించిన సీఎం చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మైక్రోబయాలజిస్టులు, పీడియాట్రిషియన్లు, పల్మనాలజిస్టులు, ప్రివెంటివ్ మెడిసిన్ నిపుణులతో టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని ఆదేశించారు. హెచ్ఎంటీవీ వైరస్ పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. 2001 నుంచి ఈ వైరస్ ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు ఏపీలో ఇటువంటి కేసులో నమోదు కాలేదని తెలియజేశారు. ఎక్యూట్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వంటి శ్వాసకోశ వ్యాధులు, ఇన్ఫ్లో ఎంజాయ్ అలాంటి సమస్యలతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక ఆదేశాలను దారి చేసింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా టాస్క్ ఫోర్స్ నుంచి సలహాలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఈ వైరస్ చేసినారు వ్యాధిగా సంక్రమిస్తున్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఐసిఎంఆర్ అది కృత వైరాలజీ ల్యాబ్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. వైరస్ టెస్టింగ్ కిట్లను కూడా సిద్ధం చేసుకోవాలని వెల్లడించారు. 3000 టెస్టింగ్ కిట్లు చెప్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే మందులు సిద్ధం చేసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 4.5 లక్షల N95 మాస్కులు, 13.71 లక్షల ట్రిపుల్ లేయర్డ్ మాస్కులు, 3.52 లక్షల పిపిఏ కిట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాల్లో వీటి సరఫరా పెంచాలని సీఎం ఆదేశించారు. ఆక్సిజన్ సరఫరా, లిక్విడ్ ఆక్సిజన్ సప్లై పైపులైన్లకు సంబంధించి అన్ని ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలన్నారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు ముందు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ వినియోగించాలని సూచిస్తున్నారు. 

ఆందోళన వద్దు.. అప్రమత్తత అవసరం..

ప్రస్తుతం వైరస్ వ్యాప్తి చెందుతున్న వ్యవహారం పట్ల ఆందోళన వద్దని నిధులు చెబుతున్నారు. అప్రమత్తతతో వైరస్ వ్యాప్తిని నియంత్రంచవచ్చని చెబుతున్నారు. ఈ వైరస్ గతంలో నుంచి ఉన్నప్పటికీ ప్రస్తుతం వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు ఈ వైరస్ సోకే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, దురదలు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాలుగు నుంచి ఏడు రోజుల్లో ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. తుంపర్ల ద్వారా, చేతుల ద్వారా శరవేగంగా వ్యాప్తి చెందుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్