విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఫీజులు ఇక కాలేజీలకే చెల్లింపు

ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను నేరుగా కాలేజీ యాజమాన్యాలకే చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలోనూ ఇదే విధానం అమలైంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. పారదర్శకత పేరుతో కాలేజీ యాజమాన్యాలకు ఫీజులను చెల్లించకుండా విద్యార్థుల తల్లి ఎకౌంటుకు ఆయా ఫీజుల మొత్తాలను వైసీపీ ప్రభుత్వం జమ చేసింది.

college students

కాలేజీ విద్యార్థులు

ఏపీలోని కూటమి ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఫీజు రియంబర్స్మెంట్ మొత్తాలను నేరుగా కాలేజీ యాజమాన్యాలకే చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. గతంలోనూ ఇదే విధానం అమలైంది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ విధానంలో మార్పులు తీసుకువచ్చింది. పారదర్శకత పేరుతో కాలేజీ యాజమాన్యాలకు ఫీజులను చెల్లించకుండా విద్యార్థుల తల్లి ఎకౌంటుకు ఆయా ఫీజుల మొత్తాలను వైసీపీ ప్రభుత్వం జమ చేసింది. ఈ మొత్తాలను కాలేజీ యాజమాన్యాలకు నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులు వెళ్లి చెల్లించడం వల్ల.. విద్యార్థి స్థితిగతులను తెలుసుకునే అవకాశం ఉంటుందని వైసీపీ ప్రభుత్వం భావించింది. ఏడాదికి నాలుగు విడతల్లో ఫీజుల మొత్తాలను వైసీపీ ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ విధానంలో కొన్ని ఇబ్బందులు ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సకాలంలో విడతలు వారీగా ఫీజులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. అనేక కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఫీజులను చెల్లించినప్పటికీ విద్యార్థులను చెల్లించమంటూ ఒత్తిడికి గురి చేశాయి. ఈ తరహా ఇబ్బందులను పరిష్కరించాలంటూ అప్పట్లో ప్రభుత్వానికి విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను గుర్తించిన కూటమి ఎన్నికల్లో హామీని ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఈ విధానాన్ని మార్పు చేసి పాత విధానాన్ని అమలు చేస్తామని అప్పట్లో లోకేష్ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే కూటమి ప్రభుత్వం తాజాగా ఫీజు రీయింబర్సుమెంట్ విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీని ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని గతంలో మాదిరిగానే అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఇక నేరుగా కాలేజీలకు ఫీజులు చెల్లిస్తామని పేర్కొంది. దీనివల్ల విద్యార్థులకు ఎంతో మేలు కలుగనుంది. 2024 25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను కాలేజీ యాజమాన్యాలపై చెల్లిస్తామని స్పష్టం చేసింది. ఇది విద్యార్థులకు ఉపశమనం కలిగించే వార్తగా చెప్పవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆయా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పటికే అనేక కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల ముక్కు పిండి మరియు ఫీజులను వసూలు చేశాయి. కొన్ని యాజమాన్యాలు ఫీజులు చెల్లిస్తేనే గాని పరీక్షలకు, ల్యాబ్ వర్కులకు కూడా అనుమతించడం లేదు. ఇటువంటి ఇబ్బందులతో తల్లిదండ్రులే అప్పులు చేసి మరి ఫీజులను చెల్లించారు. ఈ పరిస్థితుల్లో సాంఘిక సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు మేరకు ప్రభుత్వమే కాలేజీ యాజమాన్యాలకు విద్యార్థుల ఫీజులను చెల్లిస్తుంది. ఇకపై కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉండదు. కొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. తాజా నిర్ణయంతో విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్