నేడు ఢిల్లీకి వెళ్ళనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. మూడు రోజులపాటు పర్యటన

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళతారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను సీఎం చంద్రబాబు కలిసి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అక్కడే ఎనిమిది గంటలకు ఒక వివాహ వేడుకకు చంద్రబాబు హాజరవుతారు.

CM Chandrababu with Amit Shah (File Photo)

అమిత్ షాతో సీఎం చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఢిల్లీలో పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆయన ఢిల్లీకి రానున్నారు. ఉదయం 9 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరి విజయవాడ పోరంకిలోని పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ నివాసానికి సీఎం వెళతారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లి మధ్యాహ్నం 1.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీలను సీఎం చంద్రబాబు కలిసి రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం అక్కడే ఎనిమిది గంటలకు ఒక వివాహ వేడుకకు చంద్రబాబు హాజరవుతారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు 9:30 గంటలకు ఢిల్లీ నుంచి విశాఖపట్నం చేరుకుంటారు. గురువారం ఉదయం 10:30 గంటలకు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి సాయంత్రం నాలుగు గంటలకు ఢిల్లీకి చేరుకుంటారు. సాయంత్రం 5.30 గంటలకు భారత మండపంలో జరిగే ఒక టీవీ కాంక్లేవ్ లో చంద్రబాబు పాల్గొంటారు. అనంతరం గురువారం రాత్రి ఢిల్లీలోనే బస చేస్తారు. శుక్రవారం ఉదయం తిరిగి అమరావతికి బయలుదేరి వస్తారు. ఏం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన పద్యంలో ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే రాష్ట్రానికి చెందిన ఎంపీలు ఢిల్లీలో ఆయన రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ఆయనకు స్వాగతం పలికేందుకు ఎంపీలు సిద్ధంగా ఉన్నారు. సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఈ పర్యటనలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఇతరు ఎంపీలు పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు వెల్లడించారు. 

కీలక అంశాలపై చర్చించే అవకాశం 

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులు, రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై చర్చించే అవసరం ఉంది. ప్రధానంగా పోలవరం నిధులు, అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన నిధులు, అమరావతి తో పాటు విశాఖలో మెట్రో ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రంలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన రాజ్యసభ స్థానానికి సంబంధించి ఎన్నిక గురించి ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్