ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం అంచనా రూ 2,51,162 కోట్లుగా మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక శాఖ మంత్రి.. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో పరిస్థితిలో అధ్వానంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి పయ్యావుల
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.3,22,359.33 కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టగా రెవెన్యూ వ్యయం అంచనా రూ 2,51,162 కోట్లుగా మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వ తప్పిదాలను, నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక శాఖ మంత్రి.. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చారు. తమ పిల్లల భవిష్యత్తు కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో.. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో పరిస్థితిలో అధ్వానంగా ఉన్నట్లు పేర్కొన్నారు. బడ్జెట్ లో వివిధ శాఖలకు, సంక్షేమ పథకాలకు కేటాయింపులను పరిశీలిస్తే.. సూపర్ సిక్స్ పథకంలో ఒకటైన తల్లికి వందనం పథకం కింద 15 వేల రూపాయలను కొత్త విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తల్లికి వందనంతో పాటు పాఠశాల విద్యాశాఖకు రూ.31,805 కోట్లను కేటాయించారు. అమరావతి నిర్మాణానికి 6 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించారు. ఇవన్నీ బయట నుంచి వచ్చే నిధులు అని మంత్రి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అమరావతికి నిధులు కేటాయించడం లేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,705 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లను కేటాయించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధన కూటమి లక్ష్యంగా మంత్రి పేర్కొన్నారు. ఒకే కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇవ్వనున్నారు. మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో రూ.20,000 ఆర్థిక సాయం పేదరిక నిర్మూలన లక్ష్యంగా అన్నదాతకు వేట రూ.20,000 రూపాయలు ఇవ్వనున్నారు. ఏపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇచ్చింది. అందుకు అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు చేసింది. 85 వేల హెక్టార్లను డ్రిప్పు ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చేందుకు అనుమతులు ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 95.44 లక్షల ఇళ్లకు రక్షిత తాగునీరు అందించేలా ప్రణాళికలు రచించింది. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు, పశువుల పాకల వంటి నిర్మాణాలకు 30 వేల పనులను ఇప్పటికే మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు 4300 కిలోమీటర్ల మేరకు మంజూరైన సీసీ రోడ్లలో ఇప్పటికే మూడు వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తయినట్లు స్పష్తీకరించారు. 1300 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మాణం ఉన్నట్లు బడ్జెట్లో ప్రస్తావించారు. తెలుగు భాషాభివృద్ధికి పది కోట్లు కేటాయించారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఏడు లక్షలకుపైగా ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పెట్టారు. టిడ్కో ద్వారా రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి బడ్జెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2025-26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్య, మున్సిపాలిటీలు, తెలుగు భాషాభివృద్ధి వంటి అంశాలపై కీలక విధాన నిర్ణయాలు తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ అందించరున్నారు. ప్రాజెక్టుల గ్యాప్ ఫండింగ్ కోసం 2000 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయనున్నారు. చేనేతలకు ఉచిత విద్యుత్ అమలు చేయనున్నారు. చేనేత మగ్గాలపై ఆధారపడే వారికి 200 యూనిట్లు మేర ఉచిత విద్యుత్, మర మగ్గాలపై ఆధారపడే వారికి 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలోని 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమా పథకం అమలు చేయమన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కొనసాగిస్తూనే ఆరోగ్య భీమా పథకం అమలు చేయమన్నట్లు బడ్జెట్లో వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ ప్రైవేటు స్కూల్స్లో చదివే విద్యార్థులందరికీ వర్తింపజేయనున్నారు. ఏపీ బడ్జెట్లో అన్నదాత సుఖీభవ కోసం 6300 కోట్లు, ప్రకృతి సేద్యను ప్రోత్సహించేందుకు 62 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం 300 కోట్లు, హంద్రీనీవా ఉత్తరాంధ్ర సృజల స్రవంతి, గోదావరి డెల్టా, కృష్ణ డెల్టా ప్రాజెక్టులకు రూ.11,314 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ.6,705 కోట్లు, జల్ జీవన్ మిషన్ కోసం రూ.2,800 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కోసం రూ.500 కోట్లు కేటాయించారు.
శాఖల వారీగా కేటాయింపులు ఇవే..
వ్యవసాయ శాఖకు 48 వేల కోట్లు, పాఠశాల విద్యాశాఖకు రూ.31,806 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు రూ.23,260 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖకు రూ.19,265 కోట్లు, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ.18,848 కోట్లు, జల వనరుల శాఖకు రూ.18,020 కోట్లు, పురపాలక శాఖకు రూ.13,862 కోట్లు, ఇంధన శాఖకు రూ.13,600 కోట్లు, సాంఘిక సంక్షేమానికి 10,909 కోట్లు, రవాణా శాఖకు రూ.8,785 కోట్లు కేటాయించారు.