అనకాపల్లి జిల్లాలో వరసగా ప్రమాదాలు చోటుచేసుకుంతున్నాయి. మూడు రోజుల క్రిందట అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో 17 మంది మృతిచెందగా, మరో 62 మంది గాయాలపాలె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మరో ప్రమాదం ఎక్కడ చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సెజ్ లోని సినర్జన్ యాక్టివ్ ఇన్గ్రిడియంట్స్ సంస్థలో పెను ప్రమాదం సంభవించింది.
పరిశ్రమలో ప్రమాదంతో చల్లాచెదురుగా పడిన పరికరాలు
అనకాపల్లి జిల్లాలో వరసగా ప్రమాదాలు చోటుచేసుకుంతున్నాయి. మూడు రోజుల క్రిందట అనకాపల్లి జిల్లాలోని పరవాడ ఫార్మా సెజ్ లోని ఎసెన్షియా పరిశ్రమలో సంభవించిన ప్రమాదంలో 17 మంది మృతిచెందగా, మరో 62 మంది గాయాలపాలె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం జరిగి రెండు రోజులు కూడా గడవకముందే మరో ప్రమాదం ఎక్కడ చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి సెజ్ లోని సినర్జన్ యాక్టివ్ ఇన్గ్రిడియంట్స్ సంస్థలో పెను ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయాలపాలు కాగా, వీరిలో ఒకరు పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. వీరికి ప్రస్తుతం విశాఖలోని ఇండస్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవ అందించాలని అవసరమైతే ఎయిర్ అంబులెన్స్ ద్వారా వేరే ప్రాంతాలకు మెరుగైన వైద్యం కోసం తరలించాలని ఆదేశించారు. బాధితులతోనూ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అర్ధరాత్రి 12:30 ప్రాంతంలో జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సినర్జన్ యాక్టివ్ ఇన్గ్రీడీయంట్స్ సంస్థలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గాయపడిన వారిలో ముగ్గురు జార్ఖండ్ కు చెందిన వారిగా గుర్తించారు.
ఒకరు విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తిగా చెబుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను అప్రమత్తం చేశారు. హోమ్ మంత్రితోపాటు ఇతర ఉన్నతాధికారులు వెంటనే ప్రమాదం జరిగిన పరిశ్రమకు వెళ్లి సమీక్షించాలని ఆదేశించారు. బాధితులను కూడా పరామర్శించాలని సీఎం చంద్రబాబు నాయుడు హోం మంత్రిని ఆదేశించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. అచ్యుతాపురం సెజ్ లో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. భద్రతా ప్రమాణాలను పాటించకపోవడం వలన ఈ తరహా ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతుంది. ప్రమాదాలను నియంత్రించాల్సిన అధికారులు చోద్యం చూస్తుండటం వలనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పటిష్టమైన తనిఖీలను చేయకపోవడం, ఆడిట్ నిర్వహించకపోవడం వలన ఇటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయంటూ పలువురు పేర్కొంటున్నారు. పరిశ్రమల్లో భద్రత విషయంలో తగిన జాగ్రత్త చర్యలను తీసుకునేలా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. తాజా ప్రమాదం నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పరిశ్రమలపై సమీక్షించే అవకాశం ఉందని తెలుస్తోంది.