నెల్లూరు జిల్లాలో విషాదం.. కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగిన బాలుడు

ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేండ్ల బాలుడు కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు.

nellore boy petrol
ప్రతీకాత్మక చిత్రం

ఈవార్తలు, నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌లోని పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ రెండేండ్ల బాలుడు కూల్‌డ్రింక్ అనుకొని పెట్రోల్ తాగి తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాలు విడిచాడు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని ఇరుగాళమ్మ కట్టలో షేక్‌ కరిముల్లా, అమ్ము దంపతులు ఉంటున్నారు. షేక్‌ కరిముల్లా చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తుండగా, అమ్ము చేపల దుకాణంలో పనిచేస్తున్నది. వీరికి ఇద్దరు పిల్లలు కరిష్మా, కాలేషా (2) ఉన్నారు. అయితే, ఈ నెల 7న సాయంత్రం అమ్ములు ఇరుగాళమ్మ గుడి వద్ద పనిచేస్తుండగా, తల్లితో వెళ్లిన కాలేషా అక్కడే ఆడుకుంటూ తిరిగాడు. ఈ క్రమంలో కాలేషాకు ఓ పెట్రోల్ బాటిల్ కనిపించింది. దాన్ని చూసి కూల్ డ్రింక్ అనుకొని తాగేశాడు.

కాసేపటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొడుకు స్పృహ తప్పి పడిపోవటం చూసిన తల్లి అమ్ములు.. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి కన్నుమూశాడు. ఘటనపై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వెబ్ స్టోరీస్