ఓట్ల లెక్కింపు కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే : సీఈవో ముఖేష్ కుమార్ మీనా

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

CEO Mukesh Kumar Meena

 సీఈవో ముఖేష్ కుమార్ మీనా



ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే జైలుకు పంపుతామని సీఈవో ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. మచిలీపట్నం కృష్ణ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే అరెస్టు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నడుమ కౌంటింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే సిఆర్పిఎఫ్ బలగాలు కౌంటింగ్ కేంద్రాల వద్ద పహారా కాస్తున్నాయని వివరించారు. ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు కూడా చేయకూడదని స్పష్టం చేసిన ఆయన.. పోస్టల్ బ్యాలెట్లపై గెజిటెడ్ సంతకం సడలింపుపై వచ్చిన ఫిర్యాదుపై స్పష్టత ఇచ్చామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ప్రటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఏ పార్టీ గెలిచిన విజయోత్సవ వేడుకలు నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేశామని, రెచ్చగొట్టేలా ఎవరు వ్యవహరించకూడదని వెల్లడించారు. కౌంటింగ్ నిర్వహించేందుకు అనుగుణమైన ఏర్పాట్లు పూర్తిచేశామన్న ఆయన.. జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఫలితాలు తర్వాత గొడవలు జరిగే అవకాశం ఉందన్న ఇంటిలిజెన్స్ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో.. సున్నిత ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి ఇప్పటికే దర్యాప్తు పూర్తయిందని, బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్