ఇకపై డిగ్రీలో రెండు సబ్జెక్టులు.. అధ్యయనానికి కమిటీ ఏర్పాటు.!

డిగ్రీ విద్యలో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకనుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటివరకు ఉన్న మూడు ప్రధాన సభ్యులు విధానాన్ని మార్చి ఒకే సబ్జెక్టు (సింగిల్ మేజర్ సబ్జెక్టు) కు డిగ్రీని కుదించారు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించడంతోపాటు ఒకే సబ్జెక్టులో పార్టీ అంశాలను భారీగా పెంచడంతో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఒకే ప్రధాన సబ్జెక్టు విధానం పై విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వం హడావిడిగా తీసుకువచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది.

symbolic image

ప్రతీకాత్మక చిత్రం

డిగ్రీ విద్యలో సంస్కరణలకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇకనుంచి డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను బోధించేందుకు వీలుగా కసరత్తు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటివరకు ఉన్న మూడు ప్రధాన సభ్యులు విధానాన్ని మార్చి ఒకే సబ్జెక్టు (సింగిల్ మేజర్ సబ్జెక్టు) కు డిగ్రీని కుదించారు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపించడంతోపాటు ఒకే సబ్జెక్టులో పార్టీ అంశాలను భారీగా పెంచడంతో అధ్యాపకుల కొరత ఏర్పడింది. ఫలితంగా ఒకే ప్రధాన సబ్జెక్టు విధానం పై విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేనిని దృష్టిలో పెట్టుకుని ప్రస్తుత ప్రభుత్వం డిగ్రీలో రెండు ప్రధాన సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో వైసిపి ప్రభుత్వం హడావిడిగా తీసుకువచ్చిన సింగిల్ మేజర్ డిగ్రీపై అధ్యయనానికి కమిటీని నియమించింది. మూడు వారాల్లోగా డిగ్రీ విధానంలో మార్పులపై నివేదిక సమర్పించాలని కమిటీని ప్రభుత్వం ఆదేశించింది. రెండు ప్రధాన సబ్జెక్టులతో కూడిన టూ మేజర్ డిగ్రీ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు అవసరమైన మార్పులను సూచించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి టూ మేజర్ విధానం లోకి వచ్చే అవకాశం ఉంది. జూలైలో డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమవుతాయి. అప్పటిలోగా కొత్త పాఠ్యాంశాల ప్రణాళికకు తుది రూపం ఇవ్వాలని కూడా ఉన్నత విద్యా మండలి ప్రయత్నిస్తోంది.

2024 - 25 లో డిగ్రీలో చేరిన విద్యార్థులు ఒకే ప్రధాన సబ్జెక్టు విధానంలో ఉండగా.. వారిని కూడా రెండు ప్రధాన సబ్జెక్టులు విధానంలోకి మార్చే అవకాశాలపై దృష్టి సారించింది. కొత్త డిగ్రీలు రెండు ప్రధాన సబ్జెక్టులు ఉన్న వీటికి అనుబంధంగా ఇతర సబ్జెక్టులు ఉంటాయా.? లేదా.? అనేది కూడా కీలకము కానుంది. ప్రస్తుతం సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలో ఒక మైనర్ సబ్జెక్టు ఉంది. దీనిలో సోషియాలజీ, హిస్టరీ, సోషల్ వర్క్ తదితర సబ్జెక్టులు ఉంటాయి. ఒక మేజర్ సబ్జెక్టుతోపాటు ఒక మైనర్ సబ్జెక్టును కూడా ఎంపిక చేసుకోవాలి. అయితే డిగ్రీ కోర్స్ అంతా ఎక్కువగా మేజర్ సబ్జెక్టు పైనే ఉంటుంది. మైనర్ సబ్జెక్టుకు తక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో డిగ్రీ విధానం త్రీ మేజర్ విధానంలో ఉండేది. అంటే మూడు సబ్జెక్టులు ఎంపిక చేసుకునేవారు. సింగిల్ మేజర్ డిగ్రీ విధానంలో నాలుగేళ్లకు విద్యార్థులకు 160 క్రెడిట్లు ఇస్తున్నారు. దీనిలో కమ్యూనిటీ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మేజర్ సబ్జెక్టుకు 84, మైనర్ సబ్జెక్టుకు 24, భాషా సబ్జెక్టులకు 12, మల్టీ డిసిప్లినరీ కోర్సులకు ఆరు, స్కిల్ కోర్సులకు 28, ఓపెన్ ఆన్లైన్ కోర్సులకు నాలుగు, కామన్ వ్యాల్యూ యాడెడ్ కోర్సులకు రెండు క్రెడిట్లు ఇస్తున్నారు. ఇప్పుడు టూ మేజర్ సబ్జెక్టు విధానం అమలు చేస్తే మేజర్ సబ్జెక్టులకు సమానంగా క్రెడిట్లు ఇవ్వాలి. మైనర్ సబ్జెక్టుకు క్రెడిట్లు కేటాయించడం సాధ్యం కాదు. దీంతో మైనర్ సబ్జెక్టు ఉంచుతారా తొలగిస్తారా అనేది వేచి చూడాల్సి ఉంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్