తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లి.. ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు.
ఈవార్తలు, ఏపీ న్యూస్: మాచర్ల నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఈవీఎం, వీవీ ప్యాట్ లను ధ్వంసం చేసి అరాచకం సృష్టించిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఎన్నికల సంఘం పోలీస్ అధికారులను ఆదేశించింది. ఈవీఎం ను ఎమ్మెల్యే పిన్నెల్లి పగలగొట్టడానికి ఈసీ తీవ్ర అంశంగా పరిగణించింది. అయితే, తెలంగాణలోని సంగారెడ్డి వద్ద పిన్నెల్లిని అరెస్టు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, పోలింగ్ రోజు ఎమ్మెల్యే పిన్నెల్లి తన అనుచరులతో కలిసి పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లోకి దూసుకెళ్లి.. ఈవీఎంను నేలకేసి కొట్టి ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈసీ ఈ ఘటనలో ఇప్పటి వరకు పిన్నెల్లిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది.
ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని తక్షణమే అరెస్టు చేయాలని ఆదేశించింది. ఈ ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాల్సిందిగా సీఈవో ముఖేష్ కుమార్ మే నాకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే పిన్నెల్లి విదేశాలకు పారిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఐపిసి, ఆర్పి, పీడిపిపీ చట్టాల పరిధిలో పది సెక్షన్లతో పిన్నెల్లి పై కేసులు నమోదు చేశారు. ఐపిసి సెక్షన్ 143, 147, 448, 427, 353, 452, 120 బి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆర్పి చట్టం 131, 135 సెక్షన్లతో కేసులు నమోదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు.