APECET 2024 | ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ ఫలితాలు విడుదల

APECET 2024 | ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ ( APECET 2024 ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారులకు ఫలితాలను వెల్లడించారు.

apecet 2024

ప్రతీకాత్మక చిత్రం

APECET 2024 | అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ ( APECET 2024 ) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు అధికారులకు ఫలితాలను వెల్లడించారు. మే 16 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన ఏపీఈసెట్‌కు మొత్తం 3.62 లక్షల విద్యార్థులు అప్లై చేసుకోగా, 3.39 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ వర్తింపజేసి ఫలితాలను విడుదల చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,95,092 మంది విద్యార్థులు , అగ్రికల్చరల్‌ విభాగంలో 70,352 మంది విద్యార్థులు అర్హత సాధించారని అధికారులు పేర్కొన్నారు. ఫలితాలకు https://cets.apsche.ap.gov.in/ECET/ECET/ECET_GetRankCard.aspx వెబ్‌సైట్‌ను సందర్శించి, ఫలితాలు, ర్యాంకు తెలుసుకోవచ్చని తెలిపారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్