ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను భారీగా బదిలీ చేయగా, ఇప్పుడు మరో దఫా ట్రాన్స్ఫర్లను చేపట్టింది. ఇందులో భాగంగా 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది.
ఏపీ ప్రభుత్వం
అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్ ఆఫీసర్లను భారీగా బదిలీ చేయగా, ఇప్పుడు మరో దఫా ట్రాన్స్ఫర్లను చేపట్టింది. ఇందులో భాగంగా 12 మంది కలెక్టర్లను బదిలీ చేసింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్గా హరేంధిర ప్రసాద్ సహా 11 మందికి బదిలీ ఆదేశాలు జారీ చేస్తూ సీఎస్ నిర్ణయం తీసుకున్నారు.
బదిలీ అయిన కలెక్టర్లు వీరే..
శ్రీకాకుళం కలెక్టర్గా స్వప్నిల్ దినకర్
పార్వతీపురం కలెక్టర్గా శ్యామ్ ప్రసాద్
అనకాపల్లి కలెక్టర్గా కే విజయ
విశాఖపట్నం కలెక్టర్గా హరేంధిర ప్రసాద్
అంబేద్కర్ కోనసీమ కలెక్టర్గా రావిరాల మహేశ్ కుమార్
పల్నాడు కలెక్టర్గా అరుణ్ బాబు
నెల్లూరు కలెక్టర్గా ఆనంద్
తిరుపతి కలెక్టర్గా ఎస్.వెంకటేశ్వర్
అన్నమయ్య కలెక్టర్గా చామకూరి శ్రీధర్
కడప కలెక్టర్గా శివశంకర్ లతేటి
సత్యసాయి కలెక్టర్గా చేతన్
నంద్యాల కలెక్టర్గా బీ.రాజకుమారి