APSRTC | ఏపీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం.. ఎప్పటి నుంచి అమలు అంటే..

APSRTC | టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

apsrtc

ప్రతీకాత్మక చిత్రం

అమరావతి, ఈవార్తలు : కర్ణాటక, తెలంగాణలో ప్రభుత్వాలు అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎన్నికల హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన విషయం తెలిసిందే. అనుకున్నట్లే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన కోరుతూ అనేక వర్గాలు డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి స్పందించారు. నెలలోకా మహిళలకు ఆర్టీసీ ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు.

ఆదివారం ఆయన సచివాలయంలోని నాలుగో బ్లాక్‌లోని చాంబర్‌లో రవాణా, క్రీడల శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుపై తొలి సంతకం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారని, దానిపై సమీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల వచ్చే సమస్యలపై చర్చలు జరుపుతామని వివరించారు. ఆర్టీసీలో ప్రమాదాల నివారణపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తామని పేర్కొన్నారు. మరోవైపు, రాష్ట్రంలో క్రీడా వసతులు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి, దేశానికి ప్రాతినిథ్యం వహించేలా చూస్తామని అన్నారు. తనకు మూడు శాఖల బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబకు రుణపడి ఉంటానని చెప్పారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్