Breaking : ఏపీ సీఎం జగన్‌పై దాడి అనుమానితుల అరెస్టు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.

ys jagan
ఏపీ సీఎం వైఎస్ జగన్

విజయవాడ - ఈవార్తలు న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాయితో దాడి చేసిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలోని అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీశ్ కుమార్ అనే యువకుడిని, అతడితో పాటు నలుగురు స్నేహితులను అరెస్టు చేశారు. నిందితుడు సతీశ్ కుమార్ అలియాస్ సత్తి అని సమాచారం. ఫుట్‌పాత్ కోసం వేసే టైల్స్ రాయితో జగన్‌పై దాడి చేసినట్టు తెలిసింది. సతీశ్‌తో పాటు ఆకాశ్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌ను అదుపులోకి తీసుకొని, వారి ఇంటి వద్దే సిట్ అధికారులు విచారణ చేపట్టారు. కాగా, నిందితులను పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు అందజేస్తామని ఇది వరకే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

వెబ్ స్టోరీస్