ఏపీ రాజధాని అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉద్ధండరాయునిపాలేనికి చేరుకున్న ఆయన.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన వేదికకు స్థలానికి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేశారు.

ap cm chandrababu

ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి, ఈవార్తలు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి అమరావతిలో పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉద్ధండరాయునిపాలేనికి చేరుకున్న ఆయన.. అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసిన వేదికకు స్థలానికి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ప్రాంతాన్ని మొత్తం తిరిగి పరిశీలించనున్నారు. 2019 తర్వాత నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించనున్నారు. రాయపూడిలోని మినిస్టర్స్ క్వార్టర్స్ పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ఒంటి గంటకు మీడియాతో మాట్లాడనున్నారు. ఈ సందర్భంగా అమరావతి ఫ్యూచర్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. టూర్ అయ్యాక రాజధానిలో జరిగిన డ్యామేజీపై ఎంక్వైరీ కమిటీ వేయనున్నారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్