ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో.. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు.
ఏపీ మంత్రివర్గ సమావేశం
అమరావతి, ఈవార్తలు : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన ఈ సమావేశంలో.. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపారు. వాటితో పాటు.. పిఠాపురం హెడ్ క్వార్టర్గా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ, జ్యుడీషియల్ అధికారుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వాటితో పాటు.. ఏపీ జీఎస్టీ సవరణ బిల్లుకు అంగీకారం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సవరణ ఆర్డినెన్స్, ఏపీ రెగ్యులేషన్ ఆఫ్ ట్రేడ్ ఇన్ ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ఆర్డినెన్స్ కు ఆమోదం లభించింది. కుప్పం ఏరియా డెవలప్ మెంట్ అథారిటీని కుప్పం హెడ్ క్వార్టర్ గా నాలుగు మండలాలు, ఒక మున్సిపాలిటీని కవర్ చేస్తూ ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల్లో 2014-2019 మధ్య పూర్తైన పనులకు సంబంధించి బిల్లులను చెల్లించేందుకు ఓకే చెప్పింది. జ్యుడీషియల్ ఆఫీసర్ల పదవీవిరమణ వయసును 60 నుంచి 61కి పెంచేందుకు కేబినెట్ సభ్యులు ఆమోదం తెలిపారు. ఇక.. పల్నాడు జిల్లాలోని 6 మండలాలు, 92 గ్రామాలు.. సత్తెనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 1,069.55 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణ ప్రాంతం.. బాపట్ల జిల్లాలోని ఐదు మండలాలు, 62 గ్రామాలను సీఆర్డీఏ పరిధిలోకి తీసుకురావడాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇక.. పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్లను నేరుగా విద్యార్థుల కాలేజీల బ్యాంక్ అకౌంట్లకు పంపేలా నిర్ణయం తీసుకుంటూ చంద్రబాబు కేబినెట్ ఆమోదం తెలిపింది.