ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫలితాలను విడుదల చేశారు.
ఈవార్తలు, తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంటర్మీడియేట్ ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్ విద్యామండలి కార్యదర్శి సౌరభ్ గౌర్ ఫలితాలను విడుదల చేశారు. రిజల్ట్ కోసం https://resultsbie.ap. gov.in/ వెబ్సైట్ను సందర్శించి తెలుసుకోవచ్చని ఇంటర్ విద్యామండలి వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల అయ్యాయని వివరించింది. ఇంటర్ ఫస్టియర్, ఇంటర్ సెకండియర్ ఫలితాలను తెలుసుకోవచ్చు.
మొత్తంగా 2023-24 విద్యాసంవత్సరంలో రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులు కలిపి 10,52,673 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, ఫస్టియర్ విద్యార్ధులు 5,17,617 మంది ఉన్నారు. సెకండియర్ విద్యార్థులు 5,35,056 మంది పరీక్షలకు దరఖాస్తు చేసుకొన్నారు. వీరిలో 52,900 మంది పరీక్షలకు హాజరుకాలేదు.