అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో పరామర్శించనున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ చిన్నారి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర ప్రముఖులు శ్రీ తేజ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థికంగాను చేయూతను అందించారు.
ప్రతికాత్మక చిత్రం
అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో పరామర్శించనున్నారు. గడిచిన నాలుగు వారాల నుంచి సికింద్రాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో ఈ చిన్నారి చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇతర ప్రముఖులు శ్రీ తేజ్, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆర్థికంగాను చేయూతను అందించారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ శ్రీ తేజను పరామర్శించాలని నిర్ణయించారు. అయితే మొదట పోలీసులు దీనికి అనుమతి నిరాకరించారు. ఆ తర్వాత కొన్ని షరతులతో అనుమతిని ఇవ్వడంతో మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ఆసుపత్రికి వెళ్లి చిన్నారిని పరామర్శించనున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను చేసినట్లు తెలిసింది. కిమ్స్ ఆసుపత్రికి వెళ్లేటప్పుడు సమాచారం ఇవ్వాలని ఇప్పటికే పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులను అందించారు. కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్ ఎప్పుడు వెళ్దాం అనుకున్నా తామ భద్రత కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ గోపాల్ పేట పోలీసులు తెలిపారు. పరామర్శ ప్రక్రియ మొత్తం గంట లోపల ముగిసేలా చూసుకోవాలని సూచించారు. సందర్శన ప్రక్రియ అంతా గోప్యంగా ఉంచాలని, ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటనను దృష్టిలో ఉంచుకొని సహకరించాలని కోరారు. సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి రావద్దు అంటూ పోలీసులు స్పష్టం చేశారు. ఒకవేళ అలా వెళ్తే జరిగే పరిణామాలకు అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. గ తేడాది డిసెంబర్ 4వ తేదీన శ్రీ తేజ్ గాయపడిన విషయం తెలిసిందే.
శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్తున్నారని విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. వెళ్లే ముందు తమకు సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల దృష్ట్యా శ్రీ తేజను చూసేందుకు రావద్దని పోలీసులు మొదట అల్లుఅర్జున్ కు సూచించారు. అయితే అల్లు అర్జున్ మాత్రం పరామర్శించేందుకు వెళ్లాలని పట్టుబట్టడంతో పోలీసులు కొన్ని షరతులతో అందుకు అంగీకరించారు. పరామర్శించేందుకు వెళ్లాలనుకుంటే తాము చెప్పే సూచనలు పాటించాలని స్పష్టం చేశారు. అందుకు అల్లు అర్జున్ అంగీకరించడంతో మంగళవారం చిన్నారిని పరామర్శించేందుకు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు ఇందుకోసం ఏర్పాటు చేశారు. ఆయన వెంట తండ్రి పలు అరవింద్, చిత్రానికి చెందిన దర్శకుడు ఇతర ప్రముఖులు ఉంటారని చెబుతున్నారు.