మయన్మార్ లో భూకంపం సృష్టించిన విధ్వంసం వేలాదిమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వందలాది మంది ప్రాణాలను కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంపం మృతుల్లో ఎంతోమంది చిన్నారులు ఉండడం సర్వత్ర ఆవేదనకు గురిచేస్తోంది. మయన్మార్ లో బాల్యం ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 28 నాటి భూకంపం తదనంతర ప్రకంపనలతో జరిగిన విధ్వంసంలో మరణాల సంఖ్య 3,756 కు చేరగా.. మృతుల్లో 1600 మందికి పైగా బాలలు ఉన్నట్లు యూనిసెఫ్ తెలిపింది.
మయన్మార్ లో కుప్పకూలిన భవనం
మయన్మార్ లో భూకంపం సృష్టించిన విధ్వంసం వేలాదిమంది జీవితాలను చిన్నాభిన్నం చేసింది. వందలాది మంది ప్రాణాలను కోల్పోగా.. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. భూకంపం మృతుల్లో ఎంతోమంది చిన్నారులు ఉండడం సర్వత్ర ఆవేదనకు గురిచేస్తోంది. మయన్మార్ లో బాల్యం ప్రమాదంలో పడిందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ అంతర్జాతీయ బాలల అత్యవసర నిధి (యూనిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. మార్చి 28 నాటి భూకంపం తదనంతర ప్రకంపనలతో జరిగిన విధ్వంసంలో మరణాల సంఖ్య 3,756 కు చేరగా.. మృతుల్లో 1600 మందికి పైగా బాలలు ఉన్నట్లు యూనిసెఫ్ తెలిపింది. మరో 3400 మంది చిన్నారులకు గాయాలైనట్లు పేర్కొంది. మయన్మార్ బాలు ఇప్పుడు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గడిచిన ఏడాది వచ్చిన యాగి తుఫాన్, ఆ తరువాత థాయిలాండ్, వియత్నాం వరదలతో మయన్మార్ అతలాకుతలమైంది. అంతర్యుద్ధం కూడా బాల్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. మయన్మార్ లో చిన్నారులను కాపాడాల్సిన అవసరం అంతర్జాతీయ సమాజంపై ఉందని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరిన్ ఆవేదన వ్యక్తం చేశారు. మయన్మార్ భూకంపం వల్ల సుమారు 1600 మంది చిన్నారులు మృతి చెందడం ఇప్పుడు ప్రపంచాన్ని కలచివేస్తోంది. మరో మూడు వేల మందికి పైగా చిన్నారులు గాయాలు బారిన పడే వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
నిత్యవసర సరుకులకు ప్రజల ఇబ్బందులు..
భూకంప ప్రభావిత మాండలే, షికాయ్ తదితర ప్రాంతాల్లో ప్రజలు రోడ్డు పక్కన ఫుడ్ పాత్రులపై పార్కుల్లో తాత్కాలికే గూడారాలు వేసుకుని నివసిస్తున్నారు. తాగునీరు, ఆహారం, ఔషధాలు అంధకా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యవసర ధరలకు రెక్కలు రావడంతో చిన్నారులు ఆకలి తీర్చేందుకు ఒక కోడిగుడ్డు కూడా కొనలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. వివిధ దేశాలు పంపిస్తున్న సాయం తమకు అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా లేక రాత్రిళ్ళు ప్రజలు పాముకాట్లకు గురవుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. భూకంపం నేపథ్యంలో బౌద్ధుల కొత్త సంవత్సర వేడుకలను రద్దు చేస్తున్నట్లు మయన్మార్ లోని మిలటరీ కౌన్సిల్ ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి ఏటా వారం రోజులు పాటు నూతన సంవత్సర వేడుకలు నిర్వహిస్తారు. ఈ నెల 17న థింగ్యాన్ ఉండగా.. 13 నుంచి 16వ తేదీ వరకు వసంతోత్సవాలు, ఇతర వేడుకలను షెడ్యూల్ చేశారు. సర్కార్ తాజా నిర్ణయంతో ఈ వేడుకలు రద్దు అయ్యాయి. ఇదిలా ఉంటే మయన్మార్ భూకంపం సృష్టించిన విద్వానికి సంబంధించిన కార్తోషాట్ 3 ఉపగ్రహం తీసిన ఫోటోలను ఇస్రో తాజాగా విడుదల చేసింది. భూకంపానికి ముందు తర్వాత తేడాలను ఆ చిత్రాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మార్చి 28న భూకంపం సంభవించగా కార్తోషాట్ త్రి మార్చ్ 29న మయన్మార్ లోని మండలే, సగాయింగ్ నగరాలపై నుంచి ఈ ఫోటోలు తీసింది. వీటితోపాటు మార్చి 18న ఇదే ప్రాంతం పైనుంచి కార్టు షాట్ మూడు తీసిన చిత్రాలను పక్క పక్కన ఉంచిన ఇస్రో విపత్తుకు ముందు తరువాత ఈ ప్రాంతం ఎలా ఉందో స్పష్టంగా తెలియజేసింది.