దేశవ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా నిరుద్యోగ యువత సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డిగ్రీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్న సరే అందుకు అనుగుణంగా ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. దీంతో ఎంతోమంది నిరుద్యోగులు చదివిన చదువులతో సంబంధం లేకుండా ఉద్యోగాలను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు మేలు కలిగించేలా భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించేందుకు తెలంగాణలో ఒక సంస్థ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ ఏప్రిల్ 27న భారీ జాబ్ మేళా ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థ 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది.
ప్రతీకాత్మక చిత్రం
దేశవ్యాప్తంగా గడిచిన కొన్నాళ్లుగా నిరుద్యోగ యువత సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. డిగ్రీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తున్న సరే అందుకు అనుగుణంగా ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోతుంది. దీంతో ఎంతోమంది నిరుద్యోగులు చదివిన చదువులతో సంబంధం లేకుండా ఉద్యోగాలను చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులకు మేలు కలిగించేలా భారీ ఎత్తున జాబ్ మేళా నిర్వహించేందుకు తెలంగాణలో ఒక సంస్థ ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ సంస్థ ఏప్రిల్ 27న భారీ జాబ్ మేళా ఏర్పాటు చేస్తోంది. ఈ సంస్థ 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడింది. దీనిలో ప్రభుత్వ అకాడమీలు, పరిశ్రమల మధ్య సమన్వయాన్ని పెంచి యువతకు నైపుణ్యాలను అభివృద్ధి చేసే ఉద్యోగాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఏర్పాటు చేశారు. సాఫ్ట్ స్కిల్స్ అభివృద్ధి ప్రోగ్రామ్స్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, టెక్నాలజీ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, ఉద్యోగాలు, ఇంటర్ షిప్ టాస్క్ అందించే ముఖ్యమైన కార్యక్రమాలను ఈ సంస్థ నిర్వహిస్తోంది. అదే సమయంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఈ టాస్క్ సంస్థ పలుచోట్ల ఉద్యోగం మేళాలను నిర్వహిస్తోంది. వేలాదిమంది నిరుద్యోగులు ఈ మేళాలో పాల్గొని ఉద్యోగాలను పొందుతున్నారు. ఇప్పటి వరకు వేలాది మంది నిరుద్యోగులకు ఈ సంస్థ అవకాశాలను కల్పించింది.
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో టాస్క్ సంస్థ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఈ నెల 27న మెగా జాబ్ నెల నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఐదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువతకు ఇందులో వివిధ రకాల ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందులో భాగంగానే భారీ ఎత్తున ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా సుమారు పదివేల మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఏర్పాటు చేశారు. అనేక సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయి. అభ్యర్థుల అర్హతను బట్టి కనీసం 10,000 నుంచి భారీ మొత్తంలో వేతనాలతో ఉద్యోగాలను కల్పించేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి.