డయాబెటిస్ సమస్య శారీరకంగానే కాకుండా బాధితులను మానసికంగానూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. షుగర్ తో బాధపడుతున్న వారిలో 36 శాతం మంది కోపం, అపరాధ భావన, సిగ్గు, భయం, ఆందోళన, విచారం, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు జర్మనీలోని హెన్రిచ్ హీన్ యూనివర్సిటీ, డసెల్ పోర్డ్ పరిశోధకులు అధ్యయన నివేదిక లాన్సెంట్ జర్నల్ లో ప్రచురితమైంది.
డయాబెటిస్ బాధితులు
గత కొన్నాళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా డయాబెటిస్ బాధితులు గణనీయంగా పెరుగుతున్నారు. డయాబెటిస్ బాధితుల కేంద్రంగా భారత్ మారుతుంది. యాట కొన్ని లక్షల మంది మధుమేహం వ్యాధి బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు. అయితే మధుమేహ బాధితుల్లో కొన్ని రకాల మానసిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఒక పరిశోధన వెల్లడించింది. డయాబెటిస్ సమస్య శారీరకంగానే కాకుండా బాధితులను మానసికంగానూ తీవ్రంగా వేధిస్తున్నట్లు ఒక అధ్యయనం వెల్లడించింది. షుగర్ తో బాధపడుతున్న వారిలో 36 శాతం మంది కోపం, అపరాధ భావన, సిగ్గు, భయం, ఆందోళన, విచారం, ఒత్తిడి, కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు జర్మనీలోని హెన్రిచ్ హీన్ యూనివర్సిటీ, డసెల్ పోర్డ్ పరిశోధకులు అధ్యయన నివేదిక లాన్సెంట్ జర్నల్ లో ప్రచురితమైంది.
మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి.? దీనివల్ల ఇంకా ఎటువంటి సమస్యలు వస్తాయో అనే సందేహాలు జీవన నాణ్యత తగ్గిపోవడం, వైద్య ఖర్చులు పెరిగిపోవడం, మందులు వినియోగిస్తున్న చక్కెర స్థాయిలో నియంత్రణలోకి రాకపోవడం, ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి రావడం, ఔషధం మోతాదు ఎక్కువ రక్తంలో చక్కర స్థాయిలో ఆందోళన కరస్థాయిలో పడిపోతాయి అన్న భయం వంటివి.. షుగర్ వ్యాధి బాధితులను మానసిక సమస్యలకు గురవేయుల చేస్తున్నాయి అని నివేదిక పేర్కొంది. ఈ సమస్యలన్నింటినీ కలిపి డయాబెటిస్ డిస్ట్రస్ గా వ్యవహరిస్తున్నారు. టైప్ -1, టైప్ -2 డయాబెటిస్ అయినా.. జీవనశైలిలో మార్పుల ద్వారా నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. క్రమం తప్పకుండా మందులు తీసుకోవడం, ఇన్సులిన్ ఇంజక్షన్లు వినియోగించడం, నిత్యం వ్యాయామం చేయడం, శారీరకంగా చురుగ్గా ఉండడం, ఆహారపు అలవాట్లను నియంత్రించుకోవడం వంటివి తప్పనిసరి. మానసిక ఆరోగ్యం అంతగా బాగుండని వారికి ఇవన్నీ సవాళ్లుగా కనిపిస్తున్నాయని పరిశోధకులు వివరించారు. మధుమేహంతో బాధపడేవారు డయాబెటిస్ డిస్ట్రస్ లక్షణాలకు సంబంధించిన పరీక్షలు చేయించుకుని, ముందే వైద్యుల సహాయం తీసుకోవాలని ఈ పరిశోధనా బృందం సూచించింది. ఈ మానసిక సమస్యల ముప్పును గుర్తించిన అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (ఐడిఎఫ్), ఇన్సులిన్ లో కనిపెట్టి 100 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 2021లో మూడేళ్ల ప్రజారోద్యమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో పూర్తయింది. ఐడిఎఫ్ తాజా సర్వేలో మధుమోహన్ బాధితుల్లో 77% మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడయింది దీంతో 2024 నుంచి 2026 వరకు కూడా డయాబెటిస్ అండ్ వెల్ బీయింగ్ థీమ్ తో ప్రపంచ మధుమేహ దినాన్ని నిర్వహించాలని ఐడిఎఫ్ నిర్ణయించింది.
ఈ పరిశోధనా సంస్థ నివేదికలో పలు కీలక అంశాలను పేర్కొంది. సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే టైప్ -1, టైప్ -2 మధుమేహ బాధితుల్లో డిప్రెషన్ బారిన పడే ముప్పు రెండు నుంచి మూడు రెట్లు అధికంగా ఉంది. వ్యాకులత, ఆదుర్దా, చింత వంటి వాటితో బాధపడే ప్రమాదం 20% అధికం. డయాబెటిస్ బాధితుల్లో 63 శాతం మంది దీనివల్ల కార్యక్రమంలో వచ్చే దుష్ప్రభావాలు, సమస్యల గురించి ఆందోళన తమ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని పేర్కొన్నారు. 28 శాతం మంది మధుమేహ బాధితుల్లో తమ పట్ల సానుకూల భావనలు కలిగి ఉండడం కష్టంగా అనిపిస్తుందని వెల్లడించారు. టైప్ -1 మధుమేహంతో బాధపడే వారిలో ఈటింగ్ డిజార్డర్ ఉంటున్నట్లు తెలిపింది. అంటే సాధారణ ఆహారపు అలవాట్లు వల్ల వచ్చే ముప్పు సాధారణ ఆరోగ్యవంతులతో పోలిస్తే రెండు రెట్లు ఎక్కువ. టైప్ -1 బాధిత మహిళల్లో డయాబులీమియా సమస్య ఎక్కువగా ఉంటుంది. అంటే బరువు తగ్గడం కోసం తీసుకునే ఇన్సులిన్ పాళ్లను తగ్గించేసుకోవడం. టైప్ -2 మధుమేహ బాధితుల్లో అతిగా తినే సమస్య కనిపిస్తున్నట్లు అధ్యయనంలో తేలింది. కాబట్టి ఈ తరహా ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని ఈ నివేదిక సూచించింది. దీనిపై ఐడిఎఫ్ ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించింది.