ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన.. నష్టం అంచనాకు

భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి వస్తున్న ఈ బృందం కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది.

Vijayawada is a submerged city

నీట మునిగిన విజయవాడ నగరం

భారీ వర్షాలు, వరదలు సృష్టించిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. కేంద్రం నుంచి వస్తున్న ఈ బృందం కృష్ణ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల పరిధిలో రెండు రోజులపాటు పర్యటించి వరద నష్టాన్ని అంచనా వేయనుంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి అనిల్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన ఈ బృందం రెండు బృందాలుగా విడిపోయి కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాలో పర్యటించనుంది. ఇప్పటికే కేంద్రం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆశలన్నీ కేంద్ర బృందంపైనే పెట్టుకుంది. కాగా, పర్యటనకు ముందు ఈ బృందానికి రాష్ట్రంలో జరిగిన వరద నష్టాన్ని వివరించేందుకు తాడేపల్లిలోని విపత్తు నిర్వహణ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా నేతృత్వంలో జరిగే ఈ భేటీలో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా వరద నష్ట తీవ్రతను సిసోడియా వారికి వివరించనన్నారు. 

పర్యటనకు సంబంధించిన వివరాలు ఇవే..

కేంద్రం నుంచి వస్తున్న బృందంలోని ఒకటి బుధవారం మధ్యాహ్నం 12:30 నుంచి 5:30 గంటల వరకు కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనుంది. రెండో బృందం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, వేమూరు, రేపల్లె, చెరుకుపల్లి మండలాల పరిధిలో పర్యటించనుంది. లంక గ్రామాలైన ఈపూరులంక, పెద్దలంక లో పర్యటించి దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించనుంది. కృష్ణా జిల్లాకు సంబంధించి ముస్తాబాద్ రోడ్డు గన్నవరం నుంచి హనుమంతపురం రోడ్డు, గన్నవరం నుంచి బొడమేరు కెనాల్ బ్రిడ్జిలను టీమ్ పరిశీలిస్తుంది. మధ్యాహ్నం గన్నవరం ఎయిర్పోర్ట్ లో కృష్ణాజిల్లా అధికారులు వరద నష్టంపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తర్వాత తొట్లవల్లేరు, పెనమలూరు, యనమలకుదురు, పెద్దపులిపాక, చోడవరం, కంకిపాడు మండలంలోని మద్దూరు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలు, ఇల్లు, ఇతర నష్టాన్ని పరిశీలించనున్నారు. గురువారం కేంద్ర బృందం ఎన్టీఆర్ జిల్లాలో పర్యటించనుంది ప్రకాశం బ్యారేజీ కూడా సందర్శించనుంది. అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం, మైలవరం, బుడమేరు కాలువ, అజిత్ సింగ్ నగర్, అంబాపురం, బాంబే కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఇదిలా ఉంటే వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం నాటికి ఇంటింటి సర్వే పూర్తి చేయాలని రెవెన్యూ విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లాలో ఉపయోగిస్తున్న ఎన్యుమురేషన్ యాప్ లోనే డేటాను అప్లోడ్ చేయాలని సూచించారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్