దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవులు నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి అధికారులు ప్రకటించారు. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి 11 వరకు 3040, పండగ తర్వాత 3060 బస్సు సర్వీసులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని, సాధారణ రోజుల్లో ఉండే టికెట్ ధరలే వర్తిస్తాయని విజయ వాడ ఆర్టీసీ హౌస్ స్పష్టం చేసింది.
ఏపీఎస్ఆర్టీసీ బస్సులు
దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవులు నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి అధికారులు ప్రకటించారు. అక్టోబర్ నాలుగో తేదీ నుంచి 11 వరకు 3040, పండగ తర్వాత 3060 బస్సు సర్వీసులు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని, సాధారణ రోజుల్లో ఉండే టికెట్ ధరలే వర్తిస్తాయని విజయ వాడ ఆర్టీసీ హౌస్ స్పష్టం చేసింది. దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను నడపనుంది. దుర్గా శరన్నవరాత్రులకు విజయవాడకు వచ్చే భక్తులు, తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల నుంచి బస్సులు నడపనుంది. దసరాకు ముందు హైదరాబాదు నుంచి 990, బెంగళూరు నుంచి 275, చెన్నై నుంచి 65 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ నడుపుతోంది.
విశాఖ నుంచి 320, రాజమండ్రి నుంచి 260, విజయవాడ నుంచి 400 బస్సులతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పట్టణాలు, పల్లెలకు 730 ప్రత్యేక సర్వీసులు తిప్పుతోంది. దసరా తరువాత హైదరాబాదు 990, బెంగళూరు 330, చెన్నై 70 బస్సులు రాష్ట్రం నుంచి నడవనున్నాయి. విశాఖపట్నం నుంచి 260, రాజమహేంద్రవరం నుంచి 220, విజయవాడ 700, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 490 బస్సుల ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాటు చేసినట్లు ఆర్టిసి అధికారులు వెల్లడించారు. నవరాత్రుల సందర్భంగా విజయవాడకు భవాని భక్తులు ఎక్కువగా వస్తున్నందున పొరుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1100 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రయాణికులకు టికెట్ తో చిల్లర సమస్య ఏర్పడకుండా యూపీఎస్ మెషిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు ఆర్టీసీ అధికారులు వివరించారు. ఫోన్ పే, గూగుల్ పే, క్యూఆర్ కోడ్ స్కాన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డు ద్వారా టికెట్లు తీసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ముందస్తు రిజర్వేషన్లను చేసుకోవచ్చని పేర్కొంది. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్న వారికి టికెట్ ధరలలో పది శాతం రాయితీ ఉంటుందని చెప్పింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ప్రతిరోజు 1930 ట్రిప్పులు, గరుడ సేవ తర్వాత రోజుల్లో 2,714 ట్రిప్పుల ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. తమ సిబ్బంది, సూపర్వైజర్లు ప్రయాణికులు సేవకే ఉంటారని ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీ నుంచి ప్రజలను కాపాడినట్టు అయిందని పలువురు ప్రయాణికులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా దసరా సెలవులకు హైదరాబాదు, బెంగుళూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా దోచుకునేందుకు గతంలో అవకాశం ఉండేదని, ఈ ఏడాది ప్రభుత్వం భారీగా బస్సులను ఏర్పాటు చేయడంతో ఆ సమస్య చాలా వరకు తప్పుతున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.