ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ భారీగా ఏర్పాట్లను చేసింది. 56 రోజులపాటు 13 వేల రైలు నడపాలని నిర్ణయించింది. వీటిలో పది వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా మూడు వేలు ప్రత్యేక రైళ్లు మేళా జరగడానికి రెండు, మూడు రోజులు ముందు, ఆ తరువాత రెండు, మూడు రోజులు వరకు రైళ్లు నడపనున్నారు.
ప్రతికాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఈ నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరగనున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి 40 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మహా కుంభమేళాకు వచ్చే భక్తుల కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే యాత్రికులు, భక్తులను చేరవేసేందుకు రైల్వే శాఖ భారీగా ఏర్పాట్లను చేసింది. 56 రోజులపాటు 13 వేల రైలు నడపాలని నిర్ణయించింది. వీటిలో పది వేలు రెగ్యులర్ సర్వీసులు కాగా మూడు వేలు ప్రత్యేక రైళ్లు మేళా జరగడానికి రెండు, మూడు రోజులు ముందు, ఆ తరువాత రెండు, మూడు రోజులు వరకు రైళ్లు నడపనున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రాలను కలుపుతూ 560 రింగు రైళ్ళను రైల్వే శాఖ నడపనుంది. ప్రయాగరాజ్ - అయోధ్య - వారణాసి - ప్రయాగరాజ్, ప్రయాగ రాజ్ - సంగమ్ ప్రయాగ్ - జాన్పూర్ - ప్రయాగ్ - ప్రయాగ రా, గోవింద్ పురి - ప్రయాగ్ రాజ్ చిత్రకూట్ - ఝాన్సీ మార్గాల్లో వీటిని నడపనున్నారు. ప్రయాగ్ రాజ్ ప్రాంతంలోని మొత్తం తొమ్మిది రైల్వేస్టేషన్లో 560 టికెట్ కౌంటర్లను కూడా రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. భక్తులు లక్షలాదిగా తరలిరానున్న నేపథ్యంలో రైల్వే రక్షణ దళం (ఆర్పిఎఫ్), రాష్ట్ర రైల్వే పోలీసులకు చెందిన 18 వేల మందికిపైగా సిబ్బందిని మోహరిస్తున్నారు. ఉత్తర మధ్య రైల్వే జీఎం ఉపేంద్ర ఈ మేరకు ఏర్పాట్ల వివరాలను వెల్లడించారు. ప్రయాణికులకు వైద్య సేవలు అందించడానికి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు, ఈసీజీ యంత్రాలతో ప్రయాగరాజ్ జంక్షన్లో అబ్జర్వేషన్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే మహా కుంభమేళాకు ఆదివారం బాంబు బెదిరింపు వచ్చింది. ఉగ్రదాడి చేస్తానని, వెయ్యి మందిని చంపుతానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయుష్ కుమార్ జైస్వాల్ ను మహా కుంభ పోలీసులు అరెస్టు చేశారు. ఇతడు విద్యార్థి. బీహార్ లోని షాది జంగ్ వాసి. ఇన్స్టాగ్రామ్ లో నాసిర్ పఠాన్ అనే నకిలీ పేరుతో ఈ బెదిరింపు పోస్ట్ పెట్టి నేపాల్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. తన పక్కింటిలోని నాసిర్ పఠాన్ ను ఇరికించేందుకు ఆయుష్ పేరుతో ఈ పోస్ట్ పెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
మరోవైపు కుంభమేళా జరుగుతున్న స్థలానికి సంబంధించి ముస్లింలు ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ భూముల్లో మహా కుంభమేళా జరగబోతుందని అఖిలభారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి తెలిపారు. వక్ఫ్ భూమిలో ఇంత ఉత్సవం నిర్వహించేందుకు అనుమతించి ముస్లింలు తమ విశాల హృదయాన్ని చాటుకున్నారని, హిందువులు కూడా ఇచ్చిపుచ్చుకునే రీతిలో ఈ కార్యక్రమానికి తమను అనుమతించాలని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై హిందూ మహాసభ మండిపడింది. పాకిస్థాన్ ప్రేరేపిత మౌలానాను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. మహాకుంభ్ ను ఆటంక పరచడానికి ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని పేర్కొంది. మహా కుంభమేళా సందర్భంగా యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహా కుంభమేళా సందర్భంగా రసాయన, అణు విత్పత్తులు చోటు చేసుకుంటే ఎదుర్కొనేందుకు యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాటు చేసింది. సిబ్బందిని అందుకు సన్నద్ధం చేసేందుకు గత శుక్రవారం ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. యూపీ విపత్తు నిర్వహణ అథారిటీ, కేంద్ర ప్రభుత్వం అణు శక్తి విభాగం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని అథారిటీ ఉపాధ్యక్షుడు యోగేంద్ర ప్రారంభించారు. సంబంధిత సాధనాల ప్రదర్శనతోపాటు విపత్తు నిర్వహణలో కొత్త సాంకేతికలు, రసాయన ప్రమాదాలపై సత్వర స్పందన, సురక్షిత సహాయ కార్యక్రమాలు, వైద్యశాల మొదలైన వాటిపై వివిధ శాఖలకు చెందిన సుమారు 400 మందికి శిక్షణ ఇచ్చారు.