పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూరంతో దాడులు చేసి వందమంది ఉగ్రమూకలను మట్టుబెట్టింది. ఇంతకాలం ఎంతో ఓపికాగా ఉంటున్న క్రమంలో పాక్ తీరుతో భారత్కు సహనం నశించింది.
ఆపరేషన్ సింధూర్
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూరంతో దాడులు చేసి వందమంది ఉగ్రమూకలను మట్టుబెట్టింది. ఇంతకాలం ఎంతో ఓపికాగా ఉంటున్న క్రమంలో పాక్ తీరుతో భారత్కు సహనం నశించింది. ఆ ఉగ్రమూక అమాయకుల ప్రాణాలు తీయడమే కాక.. విూ ప్రధానికి వెళ్లి చెప్పండనడంతో ఇక వారిని ఏమాత్రం ఉపేక్షించకూడదని నిర్ణయించుకొంది. పఠాన్ కోట్ నుంచి రియాసీ దాడి వంటి పెద్ద కుట్రలకు కేంద్రాలుగా నిలిచిన శిక్షణ శిబిరాలను మొత్తంగా నేలమట్టం చేసింది. ఇక్కడి స్థావరాల గుట్టును భారత్ నిఘా వర్గాలు ఎప్పటినుంచో సేకరించి పెట్టాయి. మొత్తం స్థావరాల గుట్టును పసిగట్టారు. అందుకే లక్షిత దాడులు చురుకుగా చేయగలిగారు. బహవల్పూర్లోని మర్కజ్ సుబాన్. ఇది సరిహద్దుకు 100 కిలోవిూటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్కు దీనిని ఆపరేషనల్ హెడ్క్వార్టర్గా అభివర్ణిస్తారు. పుల్వామా దాడి సహా భారత్పై చాలా కుట్రలు ఇక్కడే పురుడు పోసుకున్నాయి. మసూద్ అజార్ సన్నిహితులు ఈ కేంద్రం నుంచి ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, వ్యూహాలు పన్నడం వంటివి చేశారు. దీనిని జైషే చీఫ్ మసూద్ ఇంటిగా కూడా వినియోగిస్తాడు.
ప్రస్తుతం జైషే నెంబర్2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబసభ్యులు కూడా దీనిలో ఉంటున్నారు. 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దఎత్తున లష్కరే క్యాడర్ ఇక్కడ నివాసం ఉంటోంది. వీరిలో కమాండర్లు, శిక్షకులు ఉన్నారు. లష్కరేలో చేరిన వారిని ఇక్కడ తరచూ హఫీజ్ సయీద్ వచ్చి ఆహ్వానం పలుకుతాడు. ఇక్కడ అత్యధికంగా 250 మందికి ట్రైనింగ్ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ 50100 మంది ఉంటారు. ఫిజికల్ శిక్షణతోపాటు.. జీపీఎస్ వాడటం, మ్యాప్ రీడిరగ్, ఆయుధ వినియోగం, ప్రత్యేకమైన ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ కార్యకలాపాలు కూడా ఇక్కడ చురుగ్గానే ఉంటాయి. వీరికి అవసరమైన ఆయుధాలను పాక్ సైన్యం సమకూరుస్తుంది. ముజఫరాబాద్లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ దీనికి అధిపతి. భారత్ నుంచి పారిపోయిన.. ఆసిక్ నెంగ్రూ, జైషే కమాండర్ అబ్దుల్ జిహాదీలు కూడా ఈ క్యాంప్ను వాడుకొన్నారు. ముజఫరాబాద్ రెడ్ఫోర్ట్కు ఎదురుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చేవారికి పాక్ ఎస్ఎస్జీ కమాండోలు శిక్షణ ఇస్తారు. జమ్మూకశ్మీర్లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్గా నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడూ 50100 మంది ఉగ్రవాదులు ఉంటారని సమాచారం.
మురిద్కేలోని మర్కాజ్ తోయిబా.. సరిహద్దుకు 30 కిలోవిూటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. దాదాపు 82 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ఉగ్ర క్యాంపస్ ఇది. ఇందులో మదర్సా, మార్కెట్ వంటివి కూడా ఉన్నాయి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఈ క్యాంపస్దే కీలక పాత్ర. ఇది లష్కరే హెడ్క్వార్టర్గా పనిచేస్తోంది. దాదాపు 1000 మంది వరకు ముష్కరులు ఇక్కడ ఉగ్ర శిక్షణ పొందుతున్నారు. దీని నిర్మాణానికి 2000 సంవత్సరంలో అల్ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్ 10 మిలియన్ డాలర్లు డొనేషన్గా ఇచ్చాడు. 26/11 ఉగ్రదాడికి పాల్పడిన దుర్మార్గుల్లో ఒకడైన అజ్మల్ కసబ్కు ఇక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ దాడి కుట్రదారులు డేవిడ్ కోల్మన్ హెడ్లీ, తహవ్వూర్ రాణా ఈ కేంద్రాన్ని సందర్శించారు. లష్కరే సిద్ధాంతకర్తలు అమిర్ హమ్జా, అబ్దుల్ రెహ్మాన్ అబ్ది, జాఫర్ ఇక్బాల్ ఈ ప్రాంగణంలోనే నివాసం ఉంటున్నారు. లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్, జకీర్ రహ్మన్ లఖ్వీలకు ఇక్కడ ఇళ్లు ఉన్నాయి. తెహ్రా కలాన్లోని సర్జల్ క్యాంప్. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూకశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. భారత్లోని సాంబా సెక్టర్కు కేవలం ఆరు కిలోవిూటర్ల దూరంలో ఉంది. భారత్లోకి రహస్య సొరంగాలు తవ్వేందుకు ఇది కేంద్రంగా ఉంది. షకర్గర్ ప్రాంతాన్ని లష్కరే, జైషేలు సొరంగాల నెట్వర్క్గా మార్చేశాయి. భారత్లోకి ఆయుధాలు, మత్తు పదార్థాలు రవాణా చేసేందుకు ఇది ప్రధాన లాంచ్ప్యాడ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. వీటిల్లో హిజ్బుల్ ముజాహిద్దీన్ రేడియో రిసీవర్లు, కమ్యూనికేషన్ సెంటర్లు ఉన్నాయి. జైషే కమాండర్లు ఇక్కడికి వచ్చి వెళుతుంటారు. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు ఇక్కడ పారాగ్లైడింగ్లో శిక్షణ కూడా ఇచ్చారు. పఠాన్ కోట్ ఎయిర్ బేస్పై దాడి చేసిన ఉగ్రవాదులకు జైషే కమాండర్ షాహిద్ లతీఫ్ ఇక్కడే బ్రెయిన్ వాష్ చేశాడు.
సియల్కోట్లోని క్యాంప్.. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.విూ. దూరంలో ఉన్న హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం ఇది. దీనికి చుట్టూ నివాస భవనాలు ఉన్నాయి. దీనికి మోహద్ ఇర్ఫాన్ ఖాన్ కమాండర్గా వ్యవహరిస్తున్నాడు. ఇతడు 1995లో జమ్మూలోని మౌలానా ఆజాద్ స్టేడియంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాడు. నాడు గవర్నర్ కేవీ కృష్ణారావు త్రుటిలో ఈ దాడుల నుంచి బయటపడ్డారు. ఈ ఉగ్ర స్థావరంలో దాదాపు 50 మంది ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు ఉన్నాయి. ఎల్లప్పుడూ ఇక్కడ దాదాపు 2025 మంది ఉంటారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్ర స్థావరం.. ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని భింబెర్ జిల్లాలో ఉంది. ఇక్కడ 150 మందికి శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. ఎప్పుడూ కనీసం 40 మంది ఉంటారు. ఈ కేంద్రాన్ని లష్కరే కమాండర్ ఖాసీం గుజ్జర్, అనాస్జరార్ నిర్వహిస్తున్నారు. పూంఛ్రాజౌరిరియాసీ సెక్టార్లోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం. నియంత్రణ రేఖకు 35 కి.విూ. దూరంలో ఈ క్యాంప్ ఉంది. కోట్లీ మిలిటరీ క్యాంప్నకు కేవలం రెండు కిలోవిూటర్ల దూరంలో దీనిని నిర్వహించడం గమనార్హం. ఇక్కడ 125 మంది శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు ఉన్నాయి. ఏ సమయంలోనైనా కనీసం 50 మంది ఉంటారు. హఫీజ్ అబ్దుల్ షకూర్ అలియాస్ ఖారీజరార్ ఈ కేంద్రానికి హెడ్. జైషే వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు. గతంలో హర్కత్ ఉల్ ముజాహిద్దీన్లో పనిచేశాడు. 2016 నగ్రోటాలోని బాలెనీ ఆర్మీ క్యాంప్పై దాడిలో ఇతడి హస్తం ఉన్నట్లు ఎన్ఐఏ వెల్లడించింది.
పఠాన్కోట్ ఉగ్రదాడి తర్వాత జైషే తన ఆయుధాలు, మందుగుండును దశాకా మర్కజ్ నుంచి తరలించి ఇక్కడ నిల్వ చేయడం మొదలుపెట్టింది. అవసరమైనప్పుడు షకూర్ స్వయంగా ఆయుధాలను తన వాహనంలో సియాల్కోట్కు తరలిస్తాడు. 2023 ఏప్రిల్ 20న పూంఛ్లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం. కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్. పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన స్థావరం ఇది. దాదాపు 200 మందికి ఉగ్ర శిక్షణ ఇచ్చేలా దీనిని నిర్మించారు. ప్రస్తుతం అక్కడ 30 మంది వరకు ఉండొచ్చని అంచనా. తుపాకీల వినియోగం, శారీరక దృఢత్వంపై శిక్షణ ఇస్తారు. దీంతోపాటు బోర్డర్ యాక్షన్ టీమ్, స్నైపింగ్ టెక్నిక్లు కూడా నేర్పిస్తారు. ఉగ్ర విద్యార్థులను కొండల్లోకి తీసుకెళ్లి.. పర్వత యుద్ధ తంత్రాల్లో శిక్షణ ఇస్తారు. హిజ్బుల్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ దీనికి అధిపతి. అతడే కొత్త ఉగ్రవాదులకు ఇక్కడ స్వాగతం పలుకుతాడని పేరుంది.
అంతేకాదు శిక్షణను కూడా అతడే పర్యవేక్షిస్తాడు. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్లో నాలుగు గదులు, బ్యారక్లు ఉన్నాయి. వీటిలో పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. వీటితోపాటు ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసేందుకు అవసరమైన ప్రచార సామగ్రి పెద్దఎత్తున ఇక్కడ నిల్వ చేస్తారు. ముజఫరాబాద్ లోని షవాయ్ నాలా క్యాంప్. ఇది 2000 సంవత్సరం నుంచి పనిచేస్తోంది. దీనికి హుజైఫా బిన్ యెమెన్, బైత్ ఉల్ ముజాహిద్దీన్ అనే పేర్లు కూడా ఉన్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని తంగ్ధర్ సెక్టార్లో సరిహద్దుకు 30 కిలోవిూటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. లష్కరే కమాండర్ అబు దుజానా దీనికి ఇన్ఛార్జి.