తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను శనివారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను శనివారం ఉదయం 10 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవ టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ టిక్కెట్లు పొందిన వారు ఈ నెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్ లో టికెట్లు మంజూరు కానున్నాయి. అలాగే, కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్ల కోటా, శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక పవిత్ర ఉత్సవాల సేవా టికెట్లను ఈ నెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. అదే విధంగా వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటాను ఈ నెల 21 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈ నెల 23న తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్లైన్ కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 11 గంటలకు, వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఈనెల 23 మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఈనెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు, తిరుమల తిరుపతిలో ఆగస్టు నెల గదులుకోటాను ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. ఈనెల 27 న తిరుమల తిరుపతి శ్రీవారి సేవ కోటాను ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.