కార్తీక మాసంలో దీపారాధన ఎందుకు చేయాలంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

నిత్యం ప్రతి ఇంట్లో దేవుని చెంత దీపారాధన చేయడం పరిపాటే. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, దీపదానం చేయడం వల్ల కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాల సారాంశం. శైవ, వైష్ణవ తారతమ్యాలు లేకుండా ఏ ఆలయంలోనైనా ప్రతినిత్యము ఉదయము లేదా సాయంత్రం (కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి పౌర్ణమి వంటి పర్వదినాలలో సమయం లేదు) ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలు వెలిగించవచ్చు. కొబ్బరి నూనెతో కూడా దీపాలు వెలిగించవచ్చు. అయితే ఆవు నెయ్యి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వల్ల సర్వ పాపాలు తొలిగి పుణ్యగతులు సిద్ధిస్తాయని నమ్మకం. మట్టి ప్రమిదలు ఉసిరికాయలలో రెండు వత్తులు వేసి వెలిగిస్తే పుణ్యఫలం రెట్టింపుగా ఉంటుంది. ఇంకా క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి మొక్క (బృందావనం) వద్ద సాయంత్రం వేళ దీపాలు వెలిగించి పూజలు చేసి నివేదనలు సమర్పిస్తారు. ఇది విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం.శివ విష్ణువులను పూజించే ఏకైక మాసం కార్తీకం.

అంతటి ప్రశప్తమైన ఈ మాసంలో నాగుల చవితి సోమవారాలు శుక్ల ఏకాదశి పౌర్ణమి రోజున ఉపవాస దీక్షలు ఉండి దీపాలు వెలిగిస్తే ఉత్తమ గతులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కార్తీక మాసం అంతా ఆలయాలలో సాయంత్రం వేళ నక్షత్రం మాలలు పేరుతో దీపోత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. సూర్యోదయం కంటే ముందే మేల్కొని సనానాధికాలు పూర్తి చేసి నదులు చెరువులు, ఆలయాలు లేదా ఇళ్లల్లో దీపాలు వెలిగించడం పరిపాటి. పౌర్ణమి రోజు అయితే 365 ఒత్తులు (ఒకే కట్ట) వెలిగిస్తారు. దీనిని సాధారణంగా కొబ్బరి చిప్పలో ఆవునేతితో వెలిగిస్తారు. ప్రతిరోజు దీపం వెలిగించని వారు ఇలా ఒకేసారి 365 వత్తులు వినిగిస్తే దైవానుగ్రహం కలుగుతుందని చెబుతారు. ఇక దీపదానం కూడా సత్ఫలితాలను ఇస్తుంది. ఉసిరి మట్టి ప్రమిదలు ఇలా ఎవరి తాహత్తుకు బట్టి వారు దీపాలు వెలిగించి దానం ఇవ్వవచ్చు. ఇలా నిరంత గడిపిన తర్వాత అమావాస్య మర్నాడు పోలీ స్వర్గం అంటారు. ఆరోజు ఉదయం స్నానాధులు ముగించి దీపాలు నదులు లేదా చెరువులు కాలువలలో విడిచిపెట్టడంతో కార్తీక మాసం సమాప్తం అవుతుంది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్