కార్తీక మాస విశిష్టత తెలుసా.. ఆ ఇద్దరి దేవుళ్లకు పూజలు చేస్తే గొప్ప ఫలితాలు

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

(రంగారెడ్డి, ఈవార్తలు ప్రతినిధి, అక్కినేపల్లి పురుషోత్తమరావు)

దీపాల కాంతితో కలకలలాడే ఆలయాలతో... శివనామ స్మరణ చేస్తూ ఉపవాస దీక్ష చేపట్టే భక్తులతో కార్తీకమాసం పండుగ వాతావరణం తలపిస్తుంది. హరిహరులకు ఇష్టమైన మాసంగా పరిగణించే ఈ నెలలో చేసే పూజలకు వ్రతాలకు విశేషమైన ఫలితం ఉంటుందని పురాణాలు పేర్కొంటున్నాయి. దీపావళి తర్వాత రోజు నుంచి మొదలయ్యే కార్తీకం సంవత్సరంలో వచ్చే ఎనిమిదో నెల చంద్రుడు పౌర్ణమి నాడు కృత్తికా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ నెలకు కార్తీకమనే పేరు వచ్చింది. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసంలో ఎవరిని పూజించిన ఇద్దరు సంతోషిస్తారని అంటున్నాయి శాస్త్రాలు. ఈ నెలలో చేసే జపం, ధ్యానం, నదీ స్నానం, దానం, ఆరాధనతో సకల శుభాలు కలుగుతాయి. కార్తీక సోమవారాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. సోమవారానికి అధిపతి చంద్రుడు సోమవారం అంటే శివుడికి ఇష్టం కాబట్టి ఈ నెలలో వచ్చే సోమవారాలలో ఉపవాసం ఉండి శివుడిని ఆరాధించి సాయంత్రం నక్షత్ర దర్శనం తర్వాత దీపాలు వెలిగించి భోజనం చేస్తే సకల శుభాలు కలుగుతాయని అంటారు. అలాగే కార్తీక శుక్లపక్ష విజయనాడు భగినీ హస్త భోజనం పేరుతో ప్రతి సోదరుడు తమ సోదరి ఇంటికి వెళ్లి ఆమె చేతి భోజనం తిని కానుకలు ఇవ్వడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. సవితి నాడు నాగుల చవితిగా పరిగణించి సుబ్రమణ్యేశ్వర స్వామిని కొలుస్తారు. ఇవి కాకుండా మరికొన్ని పర్వదినాలు ఈ మాసంలో ప్రత్యేకతలను సంతరించుకుంటాయి.

మాల ధారణం చేపట్టే మాసం

ఈ కార్తీకంలోనే అయ్యప్ప దీక్షను స్వీకరించడం వెనుక కారణం లేకపోలేదు. అయ్యప్పను హరిహరసుతుడిగా భావిస్తారు. మకర సంక్రమణ సమయంలో స్వామి మకరజ్యోతి రూపంలో ఆవిర్భవిస్తాడని ఓ నమ్మకం. ఆ జ్యోతిని చూసే ముందు మండపాలతో పాటు దీక్షను చేపట్టి స్వామి సన్నిధానానికి చేరుకుంటారు భక్తులు.

ద్వాదశికి ప్రాధాన్యం

కార్తీకం లో వచ్చే శుక్లపక్ష ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి పావన ద్వాదశి చిలుకు ద్వాదశి యోగేశ్వర ద్వాదశి వంటి పేర్లతో పిలుస్తారని ఈరోజు అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మదించారని పురాణాలు చెబుతున్నాయి. యోగులు మునులు తమ చతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిధి కూడా ఇదే. ఆ రోజునే విష్ణుమూర్తి తులసిలకు కల్యాణాన్ని జరిపించి దీపాలను వెలిగిస్తారు. ఆషాడ శుద్ధ ఏకాదశి నాడు పాలకడలిలో యోగనిద్రపు ఉపక్రమించిన మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొని ద్వాదశనాడు లక్ష్మీదేవిని పరిణయ మాడుతాడని విష్ణు పురాణం పేర్కొంది. అందుకే ద్వాదశి నాడు సాయంత్రం తులసిని లక్ష్మీదేవిగా అలంకరించి ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణుడి గా భావించి కళ్యాణం జరిపించే దీపాలతో అలంకరిస్తారు.

పౌర్ణమి రోజు ఏమి చేస్తారంటే..

కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రి తో సమానమైనదిగా చెబుతారు. ఈరోజునే త్రిపురాసురుడు అనే రాక్షసుడి వధ కూడా జరిగిందట. శంకరుని గురించి నారదని ద్వారా విన్న త్రిపురాసురుడు కైలాసం పైకి దండెత్తి వెళ్ళాడట. మూడు రోజుల భీకర యుద్ధం అనంతరం శంకరుడు త్రిపురసురుడిని సంహరించడంతో దేవతలంతా స్వామిని పూజించారని అందుకే ఈ పౌర్ణమిని త్రిపుర పౌర్ణమి గా పిలుస్తారని పురాణ గాధ. ఈరోజున ఉపవాసం ఉండి సాయంత్రం 365 వత్తులతో దీపాలు వెలిగించాలని ఇవి రోజుకో ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి అని చెబుతారు. ఈ పౌర్ణమి నాడు కొన్ని ప్రాంతాలలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు. ఈరోజున శివాలయాలలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుందని ప్రతీతి. అరుణాచలంలో ఈరోజున వెలిగించే దీపాన్ని దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఒక్కమాటలో చెప్పాలంటే ఈ నెల మొత్తం శివాభిషేకాలు రుద్రపట్టణం లలిత విష్ణు సహస్రనామ పారాయణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరి సకల శుభాలు కలుగుతాయని చెబుతున్నాయి శాస్త్రాలు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్