|| అయోధ్యకు చేరిన గండకి శిలలు ||
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో శ్రీరాముడు, సీత మాత విగ్రహాల తయరీ కోసం నేపాల్ లో కాళీ గందకి నది నుంచి రెండు భారీ సాలగ్రామా శిలలు సేకరించారు. విగ్రహాల తయారీ కోసం సాలగ్రామ శిలలకు ఈరోజు పూజలు నిర్వహించి అయోధ్యకు చేర్చారు. కోటి 60 లక్షల ఏళ్ల నాటి పూరాతనమైన ఈ అరుదైన సాలిగ్రామా ట్రక్కుల సహాయంతో అయోధ్యకు తీసుకువచ్చారు. సాలగ్రామ శిలలకు భక్తులు రామ మంత్రం జపిస్తూ బానసంచాలతో, పువ్వులతో స్వాగతం పలికారు. ఈ శిలలను విగ్రహాలుగా మర్చి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తయిన తర్వాత శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టించి ఈ సంవత్సర చివరి వరకు నిర్మాణం పూర్తి చేస్తామని ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు వచ్చే సంవత్సరం జనవరి నుండి స్వామివారిని దర్శించుకోవచ్చని వెల్లడించారు.