ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడో ప్రియుడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం - జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో చోటుచేసుకుంది.
ప్రియురాలితో నిందితుడు వీరభద్రం
భద్రాద్రి కొత్తగూడెం, ఈవార్తలు : ప్రియురాలిని 20 ముక్కలుగా నరికి.. గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడో ప్రియుడు. ఈ ఘటన తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం - జూలూరుపాడు మండలం మాచినేనిపేటలో చోటుచేసుకుంది. ప్రియుడు వీరభద్రం తన ప్రియురాలు స్వాతిని మూడు రోజుల క్రితం చంపి గోనె బస్తాలో పెట్టి పొలంలో పూడ్చి పెట్టాడు. గతంతో సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ జంట దగ్గర నుంచి వీరిద్దరు రూ.16 లక్షలు తీసుకున్నారు. అయితే, ఆ జంట ఉద్యోగం రాకపోవడంతో.. మోసపోయి ఆత్మహత్యకు పాల్పడింది.
అయితే, ఆ రూ.16 లక్షల విషయంలో స్వాతి, వీరభద్రానికి మధ్య విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి స్వాతిపై కోపం పెంచుకున్న వీరభద్రం ఆమె అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. చంపి.. 20 ముక్కలుగా చేసి గోనె సంచిలో కుక్కి.. పొలంలో పాతిపెట్టాడు.