బ్రెజిల్లోని సావో పాలో ప్రాంతంలోని విన్హెడోలో ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు.
ప్రతీకాత్మక చిత్రం
బ్రెజిల్లోని సావో పాలో ప్రాంతంలోని విన్హెడోలో ప్రయాణీకుల విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 62 మంది చనిపోయారు. విన్హెడో నగరంలో విమానం కూలిపోయిందని, విమానం ముందు భాగం నుంచి పొగలు వస్తున్నాయని స్థానిక అగ్నిమాపక సిబ్బంది నిర్ధారించారు. సావో పాలోలోని గౌరుల్హోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరిన విమానం కూలిపోయిందని ఎయిర్లైన్ VoePass ఒక ప్రకటనలో ధృవీకరించింది. విమానంలో 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదానికి కారణమేమిటో ప్రకటనలో వెల్లడించలేదు.విమాన ప్రమాదంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయని చెబుతున్నారు. ప్రమాదంపై బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వా విచారం వ్యక్తం చేశారు.
Brazilian airline VoePass says 62 people were aboard plane that crashed in Sao Paulo state, reports AP.
— Press Trust of India (@PTI_News) August 9, 2024
BREAKING: Voepass Flight 2283, a large passenger plane, crashes in Vinhedo, Brazil pic.twitter.com/wmpJLVYbB3
— BNO News (@BNONews) August 9, 2024