ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Rajashekar Reddy) కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2 (Yatra 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి (YS Rajashekar Reddy) కుమారుడు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (AP CM YS Jagan) నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర 2 (Yatra 2) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 2019లో విడుదలైన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్గా ఈ చిత్రాన్ని రూపొందించారు. మహి వీ రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి, జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా నటించారు. ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైన యాత్ర-2 మంచి విజయాన్ని దక్కించుకుంది. ఎప్పుడెప్పుడా అని వైఎస్ అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ సినిమా సైలెంట్గా ఓటీటీలోకి వచ్చి చేరింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime)లో చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు మేకర్స్ ట్విట్టర్లో ప్రకటన చేశారు.
యాత్ర-2 సినిమాలో.. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణాంతరం ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ కొత్త పార్టీ పెట్టడం, జైలుకు వెళ్లడం, జైలు నుంచి వచ్చాక ప్రజానాయకుడిగా ఎదిగిన తీరును కళ్లకు కట్టారు. 2009-2019 వరకు ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలను ఈ చిత్రంలో చూపించారు. కాగా, యాత్ర సినిమాలో వైఎస్ఆర్ గురించి, ఆయన పాదయాత్ర, తీసుకొన్న డేరింగ్ డెషిషన్స్ గురించి వివరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం యాత్ర-2 ఓటీటీలో దూసుకుపోతోంది.