EPFO Interest : ఖరారైన ఈపీఎఫ్ వడ్డీ రేటు.. ఈ ఏడాది ఎంతంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం



||ప్రతీకాత్మక చిత్రం||

ఈవార్తలు, బిజినెస్ న్యూస్: ఉద్యోగుల భవిష్య నిధి (employees provident fund) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2022-23 సంవత్సరానికిగానూ 8.15 శాతం వడ్డీ రేటు (8.15 percent rate of interest)ను నిర్ణయిస్తూ, కేంద్రానికి ఈపీఎఫ్‌వో (epfo) ప్రతిపాదనలు పంపింది. గత ఏడాది ఈపీఎఫ్‌వో వడ్డీ రేటు 8.10 శాతం ఉండగా, ఈ సారి 8.15 శాతంగా నిర్ణయించింది. మంగళవారం ఈపీఎఫ్‌వో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (epfo cbt) సమావేశంలో 2022-23కి గానూ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ(finance ministry)కు పంపనున్నట్లు పేర్కొంది. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చాక వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో అధికారికంగా నోటిఫై చేయనుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో 5 కోట్ల ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది.

సీబీటీ ప్రతిపాదనలపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి. గత పదేళ్ల వడ్డీ రేట్లను పరిశీలిస్తే 2015-16 ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటు 8.8 శాతంగా ఉండేది. తర్వాత తగ్గుతూ వచ్చింది. కరోనా తర్వాత మరింత తగ్గింది. ఇప్పుడు మరీ దారుణంగా 8.15 శాతానికి పడిపోయింది.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్