వాతావరణ శాఖ ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్‌లను ఎప్పుడు జారీ చేస్తుందంటే..

evarthalu
ప్రతీకాత్మక చిత్రం

||ప్రతీకాత్మక చిత్రం||

Meteorological News | వర్షాకాలం వచ్చిందంటే చాలు వానలు పడగానే వాతావరణ శాఖ ఆరెంజ్, ఎల్లో, రెడ్ అలర్ట్ అంటూ ప్రకటన చేస్తుంది. అసలు ఈ హెచ్చరికలు ఏంటి? వీటిని ఏ టైంలో జారీ చేస్తారు? ఈ రంగులు దేన్ని సూచిస్తాయి? అన్నది చాలా మందికి తెలియదు. వాతావరణ పరిస్థితులను సూచించేందుకు వాతావరణ శాఖ ఈ కలర్ కోడ్స్‌ను జారీ చేస్తుంది. 

బ్లూ అలర్ట్: ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంటే వాతావరణ శాఖ బ్లూ అలర్ట్ జారీ చేస్తుంది.

ఎల్లో అలర్ట్: వర్షాలు కురిసే పరిస్థితులు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేందుకు వాతావరణ శాఖ దీన్ని జారీ చేస్తుంది. 64.5 మిల్లీమీటర్ల నుంచి 115.5 మిల్లీ మీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నప్పుడు ఎల్లో అలెర్ట్ జారీచేస్తారు.

ఆరెంజ్ అలర్ట్: 115.6 నుంచి 204.4 మిల్లీమీటర్ల మధ్య వర్షపాతం నమోదైతే ఆరెంజ్ అలర్ట్ జారీచేస్తారు. వర్షాల వల్ల రోడ్లు, రవాణా, విమానాల రాకపోకలకు అంతరాయం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలుంటే ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు.

రెడ్ అలర్ట్: 204.5 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. సహజంగా తుఫాన్లు వచ్చినప్పుడు, 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ, అతి భారీ వర్షాలు కురుస్తాయనే అంచనా ఉంటే దీన్ని అమలు చేస్తారు.


సీబీఐకి కాళేశ్వరం కేసు.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్