||ప్రతీకాత్మక చిత్రం||
ఈవార్తలు, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. దానితో పాటు ఏఈఈ, డీఏవో పరీక్షలు కూడా రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ లెక్చరర్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు టీఎస్పీఎస్సీ వెల్లడించింది. ఇప్పటికే టౌన్ ప్లానింగ్, మెటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పరీక్షలు వాయిదా వేసింది. గత ఏడాది అక్టోబర్ 16న ప్రిలిమ్స్ను నిర్వహించారు. జూన్ 11న మళ్లీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది. ఏఈఈ, డీఏవో పరీక్షలపై త్వరలో కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది.