RAC Ticket | ఐఆర్సీటీసీ నుంచి వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకొన్నాక క్యాన్సిల్ అయితే కేవలం రూ.60 మాత్రమే చార్జి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలోనే ప్రకటన చేసింది.
ప్రతీకాత్మక చిత్రం
ఈవార్తలు, రైల్వే : రైల్వే టికెట్ బుక్ చేసుకొని క్యాన్సిల్ చేస్తే భారీగా చార్జి వసూలు చేస్తారు. కన్ఫర్మ్ టికెట్ అయినా, ఆర్ఏసీ టికెట్ అయినా క్యాన్సిల్ అయితే ప్రయాణికులు భారీగా చెల్లించుకోవాల్సిందే. ఈ భారీ రుసుం నుంచి రైల్వే శాఖ భారీ ఉపశమనం కలిగించింది. ఐఆర్సీటీసీ నుంచి వెయిటింగ్ టికెట్ బుక్ చేసుకొన్నాక క్యాన్సిల్ అయితే కేవలం రూ.60 మాత్రమే చార్జి చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు గత నెలలోనే ప్రకటన చేసింది. ఆర్ఏసీ టికెట్ క్యాన్సిల్ చేస్తే ఆర్బిట్రరీ ఫీజు వసూలు చేయడంపై ఓ ఆర్టీఐ కార్యకర్త ఐఆర్సీటీసీకి లేఖ రాశాడు.
ఐఆర్సీటీసీయే స్వయంగా ఈ టికెట్లను క్యాన్సిల్ చేస్తుందని, అలాంటప్పుడు సర్వీస్ చార్జి పేరుతో వసూలు చేయడంపై ఆయన ఫిర్యాదు చేశాడు. దీన్నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించాలని కోరాడు. వెంటనే స్పందించిన ఐఆర్సీటీసీ రూ.60 మాత్రమే వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ సమస్యను రైల్వే ఎండీ దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ఆర్టీఐ కార్యకర్తను అభినందించారు. ప్రయాణికులకు మేలు కలిగించే సమస్యను లేవనెత్తారని కొనియాడారు. ఆ ఆర్టీఐ కార్యకర్త కూడా రైల్వేశాఖకు కృతజ్ఞతలు తెలిపారు. తాను సమస్యను రైల్వే శాఖ దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.