SSC Results | ఆంధ్రప్రదేశ్ ఎస్సెస్సీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

AP SSC Results 2024 | ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు.

ap ssc results
ప్రతీకాత్మక చిత్రం

AP SSC Results 2024 | ఆంధ్రప్రదేశ్‌ పదో తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. విజయవాడలో ఉదయం 11 గంటలకు పాఠశాల విద్య కమిషనర్ సురేశ్ కుమార్ ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలకు https://bse.ap.gov.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించి తెలుసుకోవచ్చని ఆయన వెల్లడించారు. మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,43 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 1.02 లక్షల మంది ప్రైవేటుగా పరీక్షలు రాశారు. కాగా, గ్రేడింగ్ పద్ధతిలో ఫలితాలు విడుదల కానున్నాయి.

పదో తరగతి ఫలితాలకు Click Here 

గ్రేడ్‌ను బట్టి మార్కులు ఇలా..

91-100 మార్కులు = ఏ1 గ్రేడ్

81-90 మార్కులు = ఏ2 గ్రేడ్

71-80 మార్కులు = బీ1 గ్రేడ్

61-70 మార్కులు = బీ2 గ్రేడ్

51-60 మార్కులు = సీ1 గ్రేడ్

41-50 మార్కులు = సీ2 గ్రేడ్

35-40 మార్కులు = డీ గ్రేడ్

వెబ్ స్టోరీస్