టీమిండియా జెర్సీని ఆవిష్కరించిన రోహిత్‌

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది.

rohit sharma

రోహిత్‌ శర్మ

వచ్చే ఏడాది జరుగనున్న టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా బీసీసీఐ బుధవారం కొత్త జెర్సీని విడుదల చేసింది. దక్షిణాఫ్రికా-భారత్‌ మధ్య రాయ్‌పూర్‌ వేదికగా జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్‌, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ప్రచారకర్త రోహిత్‌ శర్మ టీమిండియా కొత్త జెర్సీని ఆవిష్కరించారు. టీమిండియా రైజింగ్‌ స్టార్‌ తిలక్‌ వర్మ, బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్‌ సైకియా, సంయుక్త కార్యదర్శి ప్రభతేజ్ సింగ్ భాటియా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. రాయ్‌పూర్‌కు చెందిన దాదాపు వంద మందికిపైగా విద్యార్థులను ఆహ్వానించారు. ఐసీసీ మెగా ఈవెంట్ కోసం సిద్ధం చేసిన భారత జెర్సీ లైఫ్ సైజ్ మోడల్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌ ఆడబోయే..‘ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. 2007లో తొలి ప్రపంచకప్‌ గెలిచాం. మళ్లీ కప్‌ను సాధించేందుకు 15 సంవత్సరాలకుపైగా నిరీక్షించాల్సి వచ్చింది. ఇది చాలా ఒడిదుడుకులతో కూడిన సుదీర్ఘ ప్రయాణం. కానీ, మళ్లీ ట్రోఫీ అందుకోవడం చాలా గొప్పగా అనిపించింది. ఇప్పుడు భారత్‌లో ప్రపంచకప్‌ జరుగుతున్నందున ఇది ఉత్తేజకరమైన టోర్నీ అవుతుంది. భారత జట్టుకు ఎల్లప్పుడు నా శుభాకాంక్షలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ వారికి మద్దతు ఇస్తారు. జట్టు కప్‌ను గెలిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నాను’ రోహిత్‌ చెప్పాడు.


టీమిండియాకు 10 శాతం జరిమానా
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్