రెండో విడతలో 415 మంది ఏకగ్రీవం

రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 మంది సర్పంచ్‌లు, 8,304 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా కామారెడ్డిలో 44, నల్గొండ, నిజామాబాద్‌లో 38 చొప్పున ఏకగ్రీవమయ్యాయి.

unanimous 415 in telangana elections

ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, డిసెంబర్ 7 (ఈవార్తలు): రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో 415 మంది సర్పంచ్‌లు, 8,304 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అత్యధికంగా కామారెడ్డిలో 44, నల్గొండ, నిజామాబాద్‌లో 38 చొప్పున ఏకగ్రీవమయ్యాయి. రెండో విడతలో 4,332 పంచాయతీలు, 38, 322 వార్డుల్లో ఎన్నికల కోసం ఎస్‌ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే..5 గ్రామపంచాయతీలు, 107వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. సర్పంచ్ ఎన్నిక నుంచి 7,584 మంది.. వార్డుల్లో 10,427 మంది నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొదటి విడతతో కలిపి 810 మంది సర్పంచ్‌లు, 17, 635 మంది వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్