కుక్కల్ని కంట్రోల్ చేయండి... మూగబాలుడికి ఉత్తమ వైద్యం అందించాలి...

హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు.

revanth reddy

సీఎం రేవంత్ 

అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

హయత్ నగర్/ హైదరాబాద్, డిసెంబర్ 3 (ఈవార్తలు): హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో వీధి కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన మూగ బాలుడు ప్రేమ్ చంద్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే స్పందించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి, బాలుడికి అత్యుత్తమ వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. గాయపడిన బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన సీఎం... బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి అవసరమైన తక్షణ సహాయాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. కమిషనర్ స్వయంగా ఆసుపత్రికి వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా, నగరంలో వీధి కుక్కల సమస్యపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో జరిగిన సంఘటనలను గుర్తుచేస్తూ, భవిష్యత్తులో ఇలాంటి దురదృష్టకర ఘటనలు పునరావృతం కాకుండా వీధి కుక్కల నియంత్రణకు తక్షణమే పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా, మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగ కాలనీలో ఎనిమిదేళ్ల బాలుడిపై సుమారు 20 వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బాలుడు నిలోఫర్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని, వైద్యులు తెగిపోయిన చెవికి శస్త్రచికిత్స చేశారని తల్లిదండ్రులు తెలిపారు


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్