మాదాపూర్/హైదరాబాద్, నవంబర్ 26 (ఈవార్తలు): మాదాపూర్లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది.
ప్రతీకాత్మక చిత్రం
మోసపోయిన 400 మంది
ఒక్కొక్కరి వద్ద 3 లక్షలు వసూలు
మాదాపూర్/హైదరాబాద్, నవంబర్ 26 (ఈవార్తలు): మాదాపూర్లోని ఒక నకిలీ ఐటీ కంపెనీ కొన్ని వందల మంది నిరుద్యోగులను మోసం చేసింది. శిక్షణ, ఉద్యోగ నియామకాల కోసం బాధితులను భారీ మొత్తంలో డబ్బు చెల్లించేలా చేసి మోసగించింది. నిరుద్యోగ యువతకు శిక్షణ, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి కోట్లాది రూపాయలు దోచుకుంది . రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది. దీని వెనుక సూత్రధారి స్వామి నాయుడు, అతని కుటుంబం పరారీలో ఉన్నారు. ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ కంపెనీ గత కొన్ని నెలలుగా మాదాపూర్లోని ఒక భవనంలోని కార్యాలయం పెట్టుకుని పనిచేస్తోంది. ఇది 'ఫుల్ స్టాక్ డెవలపర్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ' వంటి అధిక డిమాండ్ ఉన్న కోర్సులలో శిక్షణ అందించింది. శిక్షణ తర్వాత తన కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రతి నిరుద్యోగి దగ్గర నుండి రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు రుసుము వసూలు చేసింది. ఈ విధంగా మొత్తం 400 మంది విద్యార్థుల నుండి దాదాపు రూ. 10-12 కోట్లు వసూలు చేసినట్లు చెబుతున్నారు. ఎప్పటిలాగే బుధవారం తరగతులకు వచ్చిన నిరుద్యోగులు షాక్ అయ్యారు. తలుపులు మూసి ఉంచడం, యాజమాన్యం ఫోన్లు స్విచ్ ఆఫ్ రావడం, వాట్సాప్ గ్రూపులు డిలీట్ చేశారు. స్వామి నాయుడు, అతని భార్య, కంపెనీకి చెందిన మరికొందరు ముఖ్య వ్యక్తులు కనిపించలేదు. దీంతో అసలు విషయం బయటపడింది. ‘మాకు కూడా అద్దె చెల్లించలేదు, ఎవరో వచ్చి లాక్ చేశారు’ అని ఇంటి యజమాని చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితులు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు