మాల్దీవుల్లో మంచు లక్ష్మి గ్యాంగ్ రచ్చ

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. ప్రస్తుతం ఫుల్ వెకేషన్ మూడ్​లో ఉన్నారు

manchu family

మాల్దీవుల్లో మంచు 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంచు లక్ష్మి.. ప్రస్తుతం ఫుల్ వెకేషన్ మూడ్​లో ఉన్నారు. సినిమాలకు, షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చి తన క్లోజ్ ఫ్రెండ్స్​తో కలిసి మాల్దీవుల్లో వాలిపోయారు. అక్కడ ఈ సెలబ్రిటీ గ్యాంగ్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆ ఫొటోలు, వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్​లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ వెకేషన్​లో మంచు లక్ష్మి గారితో పాటు స్టార్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, నటుడు జాకీ భగ్నానీ తదితరులు ఉన్నారు. వీరంతా కలిసి మాల్దీవుల్లోని ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌లో విడిది చేశారు. "మనసుకు నచ్చిన వాళ్లతో వెళ్లే ట్రిప్ ఇచ్చే హాయి మరెక్కడా దొరకదు" అంటూ లక్ష్మి షేర్ చేసిన పోస్ట్ వారి మధ్య ఉన్న బాండింగ్​ను చూపిస్తోంది. ఇక అక్కడ వీరు చేసే అల్లరి మామూలుగా లేదు. స్పీడ్ బోట్లపై సముద్రం మధ్యలోకి వెళ్లి షికార్లు కొడుతూ ఫుల్​గా ఎంజాయ్ చేస్తున్నారు.


విద్యార్థినిని గొంతు కోసి చంపిన యువకుడు
పిన్‌కోడ్‌కు గుడ్‌బై చెప్పండి.. భారత్‌లో కొత్తగా డిజి పిన్

వెబ్ స్టోరీస్