శ్రీదేవి కూతురు సిగ్గు విడిచేసిందిగా..!
ప్రతీకాత్మక చిత్రం
జాన్వీ కపూర్ గత కొంతకాలంగా రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. శిఖర్ పహారియా అనే ఒక వ్యాపారవేత్తతో ప్రేమ వ్యవహారం సాగుతున్నట్లు చాలా కథనాలు వినిపించాయి. మరోవైపు శిఖర్ పహారియాకి మంచి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉంది. కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ సిండే మనవడు కావడం విశేషం. శిఖర్ పహారియా సోదరుడు వీర్ పహారియా సినిమా రంగంలో నటుడుగా చేస్తున్నాడు. శిఖర్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్ పనులు చూసుకుంటాడు. గతంలో జాన్వీ కపూర్ తో శిఖర్ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. అయితే వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది అని అందరికీ ఒక సందేహం ఉండేది. ఈ సందేహాలు అన్నిటికీ కూడా జాన్వికపూర్ మరోసారి కన్ఫామ్ చేసినట్లు అనిపిస్తోంది. బోనికపూర్ బర్త్డే సెలబ్రేషన్స్ వేడుకల్లో ఆ ఫ్యామిలీకి చెందిన వారంతా పాల్గొన్నారు. అయితే వాళ్లలో శిఖర్ పహారియా కూడా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. గెస్ట్ లా కాకుండా ఒక కుటుంబ సభ్యుడి లాగా ఆ ఈవెంట్లో తెలిసి పోయాడు. ఆ ఫోటోలు బట్టి చూస్తే జాన్వీ కపూర్ కన్ఫామ్ చేసింది అని అందరూ అనుకుంటున్నారు. ప్రస్తుతం జాన్వి కపూర్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న పెద్ది సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు ఉన్నాయి.